News July 23, 2024

JNTUలో ముగిసిన PHD పరీక్షలు

image

HYD కూకట్‌పల్లిలోని JNTUలో జరుగుతున్న PHD పరీక్షలు సోమవారంతో ముగిశాయి. రెండు రోజుల్లో కలిపి మొత్తం 675 మంది పరీక్ష రాశారు. మొత్తం 930 మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 72.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండోరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో కలిపి 400 మంది పరీక్ష రాసినట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం డైరెక్టర్ డాక్టర్ కృష్ణమోహన్‌రావు చెప్పారు. నిబంధనలను అనుసరించి పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు.

Similar News

News November 21, 2025

HYD: లిటిల్ ఇంగ్లండ్ ఎక్కడో తెలుసా?

image

HYDలో ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచే ఓ ప్రాంతం ఉందని మీకు తెలుసా? ఈ ఏరియా ఆంగ్లో- ఇండియన్‌ నివాసస్థలాల ప్రధాన కేంద్రంగా ఉండేది. బ్రిటిష్‌ జీవనశైలి, ఇంగ్లిష్‌ సంప్రదాయాల స్పష్టమైన ముద్రతో ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. వలస యుగపు సంస్కృతి ప్రతి వీధిలో ప్రతిధ్వనించేది. HYD సామాజిక రూపకల్పనలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. అదే సౌత్ లాలాగూడ. అందుకే దీనిని ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచేవారు.

News November 21, 2025

HYD: లిటిల్ ఇంగ్లండ్ ఎక్కడో తెలుసా?

image

HYDలో ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచే ఓ ప్రాంతం ఉందని మీకు తెలుసా? ఈ ఏరియా ఆంగ్లో- ఇండియన్‌ నివాసస్థలాల ప్రధాన కేంద్రంగా ఉండేది. బ్రిటిష్‌ జీవనశైలి, ఇంగ్లిష్‌ సంప్రదాయాల స్పష్టమైన ముద్రతో ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపును సంతరించుకుంది. వలస యుగపు సంస్కృతి ప్రతి వీధిలో ప్రతిధ్వనించేది. HYD సామాజిక రూపకల్పనలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. అదే సౌత్ లాలాగూడ. అందుకే దీనిని ‘లిటిల్‌ ఇంగ్లండ్‌’గా పిలిచేవారు.

News November 21, 2025

యాదగిరిగుట్ట దేవస్థానంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఖాళీగా ఉన్న మతపర సేవా పోస్టుల భర్తీకి దేవాదాయశాఖ ఆదేశాలతో ఆలయ అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. వేదపండితులు, పరిచారికలు, వాహన పురోహితులు తదితర ఉద్యోగాలకు 59 పోస్టులకు 18-46 ఏళ్లలోపు హిందువులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత పత్రాలతో DEC12 సా.5 లోపు దేవస్థానం వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.