News March 28, 2025
JNTUలో 70.41% పాస్ అయ్యారు

JNTU పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన బిటెక్ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్ (R 18 రెగ్యులేషన్)పరీక్ష ఫలితాలను అధికారులు విడుదల చేశారు. 28,480 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 27,533 విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 19,385 మంది అన్ని సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించారు. 70.41% పాస్ పర్సంటేజ్ నమోదు అయిందని అధికారులు తెలిపారు. ఫలితాలను JNTUH వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.
Similar News
News December 24, 2025
BBJCCLలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

కోల్కతాలోని బ్రేత్ వేట్ బర్న్ అండ్ జేసప్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్(<
News December 24, 2025
అంటే.. ఏంటి?: Triumph

ఈ పదం గ్రీకు భాషలో మొదలై మూడు భాషల పరిణామంతో ఇంగ్లిష్లోకి వచ్చింది. గ్రీకు భాషలో Thriambos పదం నుంచి లాటిన్లోకి triumphusగా మార్చబడింది. దాన్నుంచి పురాతన ఫ్రెంచ్లో triumpheగా రూపాంతరం చెంది ఇంగ్లిష్లో Triumphగా స్థిరపడింది. ఈ పదం అర్థం ఘన విజయం.
-రోజూ 12pmకు అంటే.. ఏంటి?లో ఓ కొత్త పదం గురించి తెలుసుకుందాం.
<<-se>>#AnteEnti<<>>
News December 24, 2025
అపరాలకు బంగారుతీగ కలుపు ముప్పు ఎక్కువ

మినుము, పెసర, కందిని ఆశించి నష్టపరిచే కలుపు మొక్కలలో బంగారుతీగ ముఖ్యమైనది. ఇది ఆశించిన పైర్లలో పెరుగుదల లోపిస్తుంది. దిగుబడులు భారీగా తగ్గిపోతాయి. పొలంలో ఒకసారి బంగారుతీగ విత్తనాలు పడితే కొన్నేళ్ల వరకు మొలుస్తాయి. అందుకే ఈ కలుపు మొక్కను పొలంలో గుర్తిస్తే విత్తనం ఏర్పడక ముందే వాటిని పీకి నాశనం చేయాలి. అలాగే మొక్కజొన్న, జొన్న వంటి పంటలతో పంట మార్పిడి చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


