News March 11, 2025

JNTU: ఈనెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరణ

image

JNTU పరిధిలో 2025-26కు సంబంధించి అఫిలియేషన్ కాలేజీ పునరుద్ధరణలో భాగంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఈనెల 15 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కళాశాల నిర్వాహకులు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా యూనివర్సిటీ సంబంధిత అధికారులను సంప్రదించి వారి సమస్యలను నివృత్తి చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Similar News

News November 22, 2025

రైతులకు సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

image

రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. రైతులు పండించే పంటలకు మార్కెటింగ్ చేసే విధంగా కలెక్టర్ ట్రేడర్లతో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. రైతులు పండించే పంటలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పిస్తూ, సాగు చేసిన పంటలకు సరైన ధర లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News November 22, 2025

పెద్దపల్లి: మళ్లీ మక్కాన్ సింగ్‌కే అవకాశం..!

image

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ను నియమిస్తున్నట్లు ఏఐసీసీ (AICC) జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. మరోసారి రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌కే అధిష్ఠానం అవకాశం కల్పించింది. దీంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

News November 22, 2025

సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షులు ఎవరంటే!

image

సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా గజ్వేల్‌కు చెందిన తూంకుంట నర్సారెడ్డి కూతురు తూంకుంట ఆంక్షారెడ్డి నియమితులయ్యారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న అధ్యక్ష పదవికి ఎంతో మంది పోటీ పడ్డారు. చివరికి మహిళా నాయకురాలైన ఆంక్షారెడ్డికి అధ్యక్ష పదవి లభించడంతో ఉత్కంఠకు తెర పడింది. 120 మందికి పైగా అధ్యక్ష పదవికి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.