News April 4, 2024
JNTU సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల

అనంత జేఎన్టీయూ పరిధిలో నిర్వహించిన వివిధ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. బీటెక్ ఫస్ట్ ఇయర్ ఒకటో సెమిస్టర్, రెండో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, ఎంఫార్మసీ ఒకటి, రెండు సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ కేశవరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు.
Similar News
News July 5, 2025
గూగూడు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీఎస్పీ

నార్పల మండలం గూగూడు గ్రామంలో కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం డీఎస్పీ వెంకటేశ్ శుక్రవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు, అగ్నిగుండం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు, అవసరమైన చోట పోలీసు సిబ్బందిని కేటాయించారు. సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంచామని చెప్పారు. అనంతరం స్వామిని దర్శించుకున్నారు.
News May 8, 2025
ATP: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ సూచించారు. AP విపత్తుల సంస్థ సూచనల మేరకు జిల్లాలో వర్షాలు, పిడుగులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. AP విపత్తుల సంస్థ SMSలు, RTGS నుంచి సూచనలను తెలుపుతున్నామన్నారు. చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదన్నారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలన్నారు.
News May 8, 2025
పేదలకు సంక్షేమ కార్యక్రమాల ద్వారా చేయూత- కలెక్టర్

అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 68,379 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు అనంతపురం కలెక్టర్ డా. వినోద్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమాజంలోని సంపన్న వర్గాల ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, పైస్థాయి ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలు, ఉన్నత స్థాయిలో ఉన్న 10% వ్యక్తులను గుర్తించి వారి ద్వారా దిగువ ఉన్న 20% కుటుంబాలకు సహాయం అందించేలా చర్యలు చేపడతామన్నారు.