News December 13, 2024
JNTUAలో 150 మంది విద్యార్థులకు ఉద్యోగాలు
అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో 2025 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్కు చెందిన 150 మంది విద్యార్థులు కళాశాల ప్రాంగణ నియామకాలలో ఉద్యోగాలు సాధించినట్లు ఇన్ఛార్జ్ వీసీ సుదర్శన రావు పేర్కొన్నారు. ఇందులో 121 మంది TCSలో, 11 మంది L&Tలో, 9 మంది CTSలో, 6 మంది FACTSETలో, 3 మంది MOSCHIPలో ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఇన్ఛార్జ్ వీసీ సుదర్శన రావు, కళాశాల ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు.
Similar News
News January 19, 2025
ఈనెల 21న శ్రీ సత్యసాయి జిల్లాకు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి రాక
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాతా హుస్సేన్ ఈనెల 21న శ్రీ సత్యసాయి జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం కదిరి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారన్నారు. అనంతరం రాందాస్ తండా, బోడే నాయక్ తండాను పరిశీలిస్తారని తెలిపారు. ముదిగుబ్బ మండలం మీదుగా ఉదయం 11 గంటలకు జొన్నల కొత్తపల్లి తండాను సందర్శిస్తారని వెల్లడించారు.
News January 18, 2025
JC ప్రభాకర్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన నటి మాధవీలత
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ JC ప్రభాకర్ రెడ్డిపై నటి మాధవీలత ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేశారు. MAA ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రం అందచేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జేసీపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. కాగా న్యూ ఇయర్ సందర్భంగా మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన జేసీ తర్వాత క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే.
News January 18, 2025
అనంతపురం ఎంపీపై సీఎం ఆగ్రహం!
సీఎం చంద్రబాబు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, ఎంపీలతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు. పార్టీ సమావేశం కంటే ఇతర పనులే ముఖ్యమా? అని సీఎం మండిపడ్డారు. ఇలాంటి సమావేశాలకు ఎంపీలు రాకపోవడం ఏంటని టీడీపీ పార్లమెంటరీ నేత శ్రీకృష్ణదేవరాయలును ప్రశ్నించారు. ఇకపై మారకుంటే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించినట్లు సమాచారం.