News September 24, 2024

నియోజకవర్గాల్లో ప్రతి నెలా జాబ్ మేళా: నారా లోకేశ్

image

AP: రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా ప్రతి నెలా జాబ్ మేళా నిర్వహణకు క్యాలెండర్ రూపొందించాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఉన్నత విద్యాశాఖ అధికారులతో ఆయన రివ్యూ నిర్వహించారు. రాష్ట్రంలో యూనివర్సిటీలలో చదివే ప్రతి విద్యార్థికీ ఉద్యోగం రావాలన్నారు. దానికి అనుగుణంగా మార్పులు చేయాలని సూచించారు. ర్యాంకింగ్స్ మెరుగుదలకు నిపుణుల సలహాలు తీసుకోవాలని చెప్పారు.

Similar News

News November 11, 2025

మళ్లీ తల్లి పాత్రలో నటించను: మీనాక్షి చౌదరి

image

తన గురించి ఏమైనా చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తానని, రూమర్లు సృష్టించాల్సిన అవసరం లేదని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు. ‘లక్కీ భాస్కర్ కథ నచ్చి తల్లి క్యారెక్టర్ చేశా. ఇక అటువంటి పాత్రలు వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేస్తా. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘విశ్వంభర’ నా కెరీర్‌లో స్పెషల్ చాప్టర్‌గా నిలిచిపోతుంది. సీనియర్ హీరోలతో నటించడానికి ఇబ్బంది లేదు’ అని మీనాక్షి చెప్పారు.

News November 11, 2025

సనాతన ధర్మ భావాలను ఎగతాళి చేస్తే..: పవన్

image

AP: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల ఓ పుణ్యక్షేత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రం. ఆ లడ్డూకు ఎంతో పవిత్రత ఉంది. ఏడాదికి సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు వస్తుంటారు. విశ్వాసం, సనాతన ధర్మ భావాలను ఎవరైనా ఎగతాళి చేస్తే అది ఆధ్యాత్మిక నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News November 11, 2025

సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NIGST), సర్వే ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBA, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, PhD ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, FRF పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://surveyofindia.gov.in