News April 8, 2025

ఈ నెల 11న జాబ్ మేళా

image

TG: టాస్క్ సంస్థతో కలిసి ప్రభుత్వం ఈ నెల 11న వరంగల్‌లో జాబ్ మేళాను నిర్వహించనుంది. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ కోరారు. హాజరయ్యే అభ్యర్థులు ఎండలకు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. యువత భారీ ఎత్తున హాజరై అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

Similar News

News April 8, 2025

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ: కేంద్రమంత్రి

image

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ పరిశ్రమ రాబోతున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు పెట్రోలియం రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ముందున్నాయన్నారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

News April 8, 2025

శ్రీలీలతో డేటింగ్.. బాలీవుడ్ హీరో ఏమన్నారంటే?

image

కుర్ర హీరోయిన్ శ్రీలీలతో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ స్పందించారు. తనకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పారు. తన గురించి వస్తున్న కథనాలపై స్పందించేందుకు చిత్ర పరిశ్రమలో బంధువులెవరూ లేరన్నారు. ప్రస్తుతం ఈ హీరో శ్రీలీలతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది.

News April 8, 2025

ఇలా చేయడానికి సిగ్గుందా?: YS జగన్

image

AP: లింగమయ్య హత్య ఘటనలో 20 మందికి పైగా పాల్గొంటే, ఇద్దరిపైనే కేసులు పెడతారా? అని YS జగన్ ప్రశ్నించారు. ‘బేస్ బాల్ బ్యాట్, కత్తులు, కట్టెలతో దాడి చేశారు. బ్యాట్‌తో చేసిన దాడిలో లింగమయ్య చనిపోయారు. ఇది న్యాయమా? ధర్మమా అని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ఇలాంటి చర్యలకు చేయడానికి సిగ్గుందా? హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యే, ఆమె కొడుకుపై కేసులు పెట్టరా?ఉండవా?’ అని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

error: Content is protected !!