News November 21, 2024

రూ.20లక్షలు చెల్లిస్తేనే ఉద్యోగం: జొమాటో CEO

image

జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఈవో దీపిందర్ గోయల్ పిలుపునిచ్చారు. 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు వారు అర్హులని తెలిపారు. అయితే, దీనికి ఎలాంటి రెజ్యూమ్ అవసరం లేదని, జాయిన్ అవ్వాలంటే రూ.20లక్షలు విరాళంగా ఇవ్వాలన్నారు. వీటిని చారిటీకి అందిస్తామని, తనతోపాటు ఉంటూ నేర్చుకోవాలి అనుకునే వారికి ఇది మంచి అవకాశం అని సూచించారు. ఇదొక లర్నింగ్ ప్రోగ్రామ్ మాత్రమే అని ప్రకటనలో చెప్పారు.

Similar News

News November 15, 2025

ఓడిపోయినా కేటీఆర్ బలుపు తగ్గలేదు: అద్దంకి

image

TG: జూబ్లీహిల్స్‌లో ఓడిపోయినా KTRకు బలుపు తగ్గలేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ విమర్శించారు. ‘నువ్వే అభ్యర్థి లాగా తిరిగావ్. మాగంటి సునీతను అభ్యర్థిగా నిలబెట్టినా ఆమెతో కనీసం మాట్లాడనివ్వలేదు. మా అభ్యర్థికి 25వేల మెజారిటీ వస్తే బొటాబొటీతో గెలిచారు అంటున్నావ్. నీకు సిగ్గు లేదా. ఆత్మపరిశీలన చేసుకో. నీతోనే BRS పతనం అవ్వడం ఖాయం’ అని మీడియా సమావేశంలో మండిపడ్డారు.

News November 15, 2025

ఏపీ న్యూస్ రౌండప్

image

* ఏ ఎన్నికలైనా బిహార్ లాంటి ఫలితాలే NDAకు వస్తాయి: బీజేపీ ఎంపీ పురందీశ్వరి
* లిక్కర్ కేసులో అరెస్టయిన అనిల్ చోఖ్రాకు విజయవాడ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది.
* సింగపూర్-విజయవాడల మధ్య నేరుగా విమాన సర్వీసులు ఇవాళ ప్రారంభమయ్యాయి.
* పరకామణి కేసులో సాక్షి అయిన టీటీడీ మాజీ ఏవీఎస్‌వో సతీశ్ మరణంపై విచారణ కొనసాగుతోంది. గుంతకల్ రైల్వే స్టేషన్‌లో అతని బైక్‌ను పోలీసులు గుర్తించారు.

News November 15, 2025

96 లక్షల ఫాలోవర్లు.. 50 వేల ఓట్ల తేడాతో ఓటమి

image

బిహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ అభ్యర్థి, యూట్యూబర్ మనీశ్ కశ్యప్ పోటీ చేసి ఓడిపోయారు. చన్‌పటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభిషేక్ రంజన్ గెలుపొందారు. యూట్యూబ్‌లో 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న మనీశ్‌కు 37,172 ఓట్లు రాగా 50 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడారు. తమిళనాడులో వలస కూలీలపై దాడులు చేసి చంపుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలతో అప్పట్లో అతడిని TN పోలీసులు అరెస్టు చేశారు.