News July 15, 2024
40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు: TCS

ఈ ఆర్థిక సంవత్సరంలో 40,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిస్తామని <<13630881>>TCS<<>> ప్రకటించింది. APR1-JUN30 మధ్య నియమించుకున్న 5,452 మంది కంపెనీ వృద్ధిలో కీలకపాత్ర పోషించారంది. ఉద్యోగులకు 4.5%-7% ఇంక్రిమెంట్ ఇచ్చామని, మరింత మెరుగ్గా పని చేసినవారు 10%-12% అందుకున్నట్లు వివరించింది. కొత్త టాలెంట్కు భారత్ గమ్యస్థానంగా ఉందని, సమీప భవిష్యత్తులో ఇది మారదని పేర్కొంది.
Similar News
News September 19, 2025
ఆటో డ్రైవర్లకు రూ.15వేలు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

AP: ఆటో/క్యాబ్ డ్రైవర్లు <<17674897>>వాహనమిత్ర <<>>పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. <<17731468>>అప్లికేషన్ ఫాంలను<<>> ఫిల్ చేసి గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయాలి. వాటిపై సచివాలయ సిబ్బంది 22న క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. అర్హుల జాబితాను 24న ప్రకటిస్తారు. ఎంపికైన వారికి దసరా పండుగ రోజున ఖాతాల్లో రూ.15వేలు జమ చేస్తారు.
News September 19, 2025
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 పెరిగి రూ.1,11,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10g గోల్డ్ రూ.150 ఎగబాకి రూ.1,02,050 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.2000 పెరిగి రూ.1,43,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 19, 2025
తిరుమలలో ప్లాస్టిక్ ఇస్తే రూ.5!

AP: ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు తిరుమల పీఏసీ-5లో రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ Reklaim Ace యంత్రం పనితీరును అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి నిన్న పరిశీలించారు. భక్తులు ఈ యంత్రంలో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వదిలివేయవచ్చని, అందుకోసం UPI ద్వారా లాగిన్ అయ్యి QR కోడ్ స్కాన్ చేయాలని అధికారులు తెలిపారు. రింగ్లో ప్లాస్టిక్ వదిలివేసే వారికి రూ.5 ప్రోత్సాహకంగా లభిస్తుందన్నారు.