News November 22, 2024
ఉద్యోగాలను ఏఐ ఇప్పట్లో భర్తీ చేయలేదు: గూగుల్ రీసర్చ్ హెడ్

టెక్ ఇండస్ట్రీలో AI వినియోగం పెరగడంపై గూగుల్ రీసర్చ్ హెడ్ యోస్సీ మాటియాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. హ్యూమన్ డెవలపర్లను ఇప్పట్లో AI భర్తీ చేయలేదని అన్నారు. కోడింగ్ నేర్చుకోవడం ఇప్పటికీ ముఖ్యమేనని పేర్కొన్నారు. కొన్ని టాస్క్లలో AI టూల్స్ను వినియోగిస్తున్నప్పటికీ, హ్యూమన్ కోడర్లకు AI ప్రత్యామ్నాయం కాదని తెలిపారు. AI- రూపొందించిన కోడ్కు హ్యూమన్ రివ్యూ, వాలిడేషన్ అవసరం అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
Similar News
News September 18, 2025
మృతుల కుటుంబాలకు ₹5లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా

AP: నెల్లూరు (D) సంగం(M) పెరమన వద్ద నిన్న కారును టిప్పర్ ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతిచెందారు. ఈ ప్రమాదంపై CM చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.35లక్షలు పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. రాంగ్ రూట్లో వచ్చిన టిప్పర్ కారును ఢీకొట్టి కొద్దిదూరం లాక్కెళ్లగా చిన్నారితో సహా ఏడుగురు మరణించారు.
News September 18, 2025
HLL లైఫ్కేర్లో ఉద్యోగాలు

<
News September 18, 2025
త్వరలో US టారిఫ్స్ ఎత్తివేసే ఛాన్స్: CEA

భారతీయ వస్తువులపై US విధించిన 25% అడిషనల్ టారిఫ్స్ను నవంబర్ 30 తర్వాత ఎత్తివేసే ఛాన్సుందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్(CEA) అనంత నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు. ‘IND, US మధ్య ట్రేడ్ చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవలి పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో పరస్పర సుంకాలకు పరిష్కారం లభించే ఛాన్సుంది. జియో పాలిటిక్స్ పరిస్థితులే US టారిఫ్స్కు కారణమని అనుకుంటున్నా’ అని కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.