News October 4, 2024
క్రూడ్ రేట్లకు ఫైర్ అంటించిన జో బైడెన్!

బ్రెంట్ క్రూడాయిల్ రేట్లు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ వ్యాఖ్యలే ఇందుకు కారణం. మొన్నటి వరకు బ్యారెల్ సగటున $70 పలికింది. ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించడంతో పరిస్థితి మారింది. ఇరాన్ ఆయువుపట్టయిన ఆయిల్ ఫీల్డ్స్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల గురించి డిస్కస్ చేస్తామని జోబైడెన్ గురువారం చెప్పారు. దీంతో క్రూడ్ వెంటనే $75 డాలర్లకు చేరింది. ఇవాళ ఇంకా పెరిగే ఛాన్సుంది.
Similar News
News March 26, 2026
ఏప్రిల్ 4 నుంచి టెన్త్ వాల్యుయేషన్

APలో ఈ నెల 16 నుంచి కొనసాగుతోన్న టెన్త్ ఎగ్జామ్స్ APR 2తో ముగుస్తాయి. వచ్చే నెల 4 నుంచి 13 మధ్య వాల్యుయేషన్ పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి వెల్లడించారు. ఈసారి ట్యాబ్స్ ద్వారా మూల్యాంకనం సెంటర్లలోనే మార్కులను నమోదు చేస్తారన్నారు. అన్ని కేంద్రాల్లో CCTVలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా APR మూడో వారంలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది.
News March 26, 2026
నేపాల్లో లీటర్ పెట్రోల్ రూ.187

యుద్ధ ప్రభావంతో నేపాల్లో పెట్రోల్, డీజిల్, కిరోసిన్ ధరలు లీటరుకు రూ.15 (నేపాల్ కరెన్సీ)చొప్పున పెరిగాయి. కేటగిరీ-1 ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.184.50, కేటగిరీ-2లో రూ.186, కేటగిరీ-3లో రూ.187గా ఉంది. ఆయా ప్రాంతాలను బట్టి డీజిల్, కిరోసిన్ రేట్లు రూ.164.50, రూ.166గా ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ధరలకు అనుగుణంగా దేశీయంగా రేట్ల పెంపు తప్పలేదని నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ వెల్లడించింది.
News March 26, 2026
ధురంధర్-2పై ఏఐ వీడియోలు.. డైరెక్టర్ వార్నింగ్

ధురంధర్-2 సినిమాకు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణకు డైరెక్టర్ ఆదిత్య ధర్ ధన్యవాదాలు తెలిపారు. అయితే కొందరు చిత్రంలోని సన్నివేశాలను AIతో మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘హమ్జా పాత్ర తలపాగా ధరించి ధూమపానం చేస్తున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇది అవాస్తవం. రెచ్చగొట్టడానికి, గందరగోళం సృష్టించడానికి ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని SMలో హెచ్చరించారు.


