News December 19, 2024

YS జగన్‌ను కలిసిన జోగి రమేశ్

image

AP: YCP అధినేత, మాజీ CM జగన్‌ను మాజీ మంత్రి జోగి రమేశ్ కలిశారు. నూజివీడులో TDP నేతలతో కలిసి ఆయన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడం జిల్లా రాజకీయాలను కుదుపునకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ జగన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. అటు, జోగి రమేశ్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష, RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణపై TDP ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Similar News

News December 9, 2025

NGKL: నేటితో ప్రచారానికి తెర..!

image

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచారానికి నేడు సాయంత్రం 5 గంటలకు తెర పడనుంది. ఆయా పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులు మద్యం, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసి గెలవాలని చూస్తున్నారు. మొత్తం 151 గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

News December 9, 2025

బెస్ట్ రైస్ డిష్‌లో హైదరాబాద్ బిర్యానీ సత్తా

image

ప్రపంచ ప్రఖ్యాత ఆహార రేటింగ్ సంస్థ టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన 2026 ‘బెస్ట్ ఫుడ్’ జాబితాలో హైదరాబాద్ బిర్యానీ మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. టాప్ 100 డిషెస్ జాబితాలో 72వ స్థానంలో నిలిచిన హైదరాబాదీ బిర్యానీ, ప్రపంచంలోని టాప్ 50 బెస్ట్ రైస్ డిషెస్‌లో 10వ స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. సువాసనభరితమైన బాస్మతి రైస్, మసాలాలు హైదరాబాదీ బిర్యానీకి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి.

News December 9, 2025

‘స్టార్‌లింక్’ ధరలు ప్రకటించలేదు.. క్లారిటీ ఇచ్చిన సంస్థ

image

భారత్‌లో ‘స్టార్‌లింక్’ సేవల ధరలు ఇప్పటివరకు ప్రకటించలేదని సంస్థ స్పష్టం చేసింది. ఇటీవల స్టార్‌లింక్ ఇండియా వెబ్‌సైట్‌లో నెలకు రూ.8,600 ఛార్జీలు, హార్డ్‌వేర్ కిట్ రూ.34,000గా <<18504876>>చూపడాన్ని<<>> ‘కాన్ఫిగరేషన్ గ్లిచ్’గా కంపెనీ పేర్కొంది. అవి కేవలం డమ్మీ డేటా మాత్రమేనని, అసలు ధరలు ఇంకా ఫిక్స్‌ చేయలేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ అనుమతులు పూర్తయ్యాకే సేవలు ప్రారంభమవుతాయని క్లారిటీ ఇచ్చారు.