News June 4, 2024

పెనమలూరులో వైసీపీ అభ్యర్థి జోగి రమేశ్ ముందంజ

image

AP: పెనమలూరులో మంత్రి జోగి రమేశ్ లీడింగ్‌లో ఉన్నారు. తన ప్రత్యర్థి బోడె ప్రసాద్‌పై 275 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇటు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు(SC)లో టీడీపీ అభ్యర్థి బూర్ల రామంజనేయులు 2,758 ఓట్ల లీడింగ్‌లో ఉన్నారు.

Similar News

News November 17, 2025

అముర్ ఫాల్కన్.. రోజుకు వెయ్యి కి.మీల ప్రయాణం

image

ప్రపంచంలోనే అత్యంత దూరం(22000 KM) వలస వెళ్లే పక్షుల్లో అముర్ ఫాల్కన్ జాతిది అగ్రస్థానం. సైబీరియా/ఉత్తర చైనా నుంచి వింటర్‌లో IND(ఈశాన్య రాష్ట్రాలు) మీదుగా ఆఫ్రికాకు ప్రయాణిస్తాయి. తాజాగా మణిపుర్ అముర్ ఫాల్కన్ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా 3 పక్షులకు శాటిలైట్ ట్యాగ్ చేశారు. వీటిలోని ఓ మగ పక్షి రోజుకు 1000KM చొప్పున 3 రోజుల్లోనే 3100KM వెళ్లినట్లు IAS సుప్రియ వెల్లడించారు. వీటి జర్నీ అద్భుతమన్నారు.

News November 17, 2025

జుట్టు జిడ్డు ఇలా తగ్గిద్దాం..

image

కాలుష్యం, దుమ్మూ తోడై కొందరి జుట్టు త్వరగా జిడ్డుగా మారుతుంది. దానికోసం ఈ చిట్కాలు.. * షాంపూలో స్పూన్ కలబంద, నిమ్మరసం చేర్చి తలకు పెట్టుకోవాలి. ఈ మిశ్రమంతో వారానికి రెండుసార్లు తలస్నానం చేయాలి. * రెండు స్పూన్ల ముల్తానీమట్టిని పేస్ట్‌లా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. * తలస్నానం చేసిన జుట్టుకు బ్లాక్ టీని పట్టించి ఇరవైనిమిషాల తర్వాత కడిగేస్తే జిడ్డు తగ్గుతుంది.

News November 17, 2025

జిన్నింగ్ మిల్లుల బంద్‌.. రైతుల ఆవేదన!

image

TG: CCI విధానాలను వ్యతిరేకిస్తూ కాటన్ మిల్లర్లు నిరసనకు దిగారు. L1, L2 కేటగిరీలను ఎత్తివేయాలంటూ నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల బంద్‌ చేపట్టారు. దీంతో రైతులపై మరో పిడుగు పడినట్లయింది. ఇప్పటికే ‘కపాస్’ యాప్‌లో స్లాట్ బుకింగ్, ఎకరాకు 7 క్వింటాళ్లే కొనుగోలు, తేమ 8-12% మించొద్దన్న నిబంధనలతో ఇబ్బందులు పడుతున్నారు. వానలు తగ్గడంతో తేమ సమస్య ఉండదనుకుంటే బంద్‌తో కొనుగోళ్లు ఆగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.