News October 9, 2025
జాన్సన్ & జాన్సన్కు రూ.8వేల కోట్ల జరిమానా!

ఫార్మా దిగ్గజం ‘జాన్సన్ & జాన్సన్’కు టాల్కమ్ పౌడర్ సంబంధిత కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పౌడర్ వాడిన 88ఏళ్ల మే మూర్ 2021లో మెసోథెలియోమా అనే అరుదైన క్యాన్సర్తో చనిపోయారు. బాధితురాలి కుటుంబీకులు USA కోర్టుని ఆశ్రయించగా సుదీర్ఘ విచారణ తర్వాత కంపెనీకి $966 మిలియన్ల (రూ. 8,000 కోట్లు) భారీ జరిమానా విధించింది. అయితే ఈ తీర్పుపై సంస్థ అప్పీల్కు వెళ్లనుంది. ఇప్పటికే సంస్థపై 63వేల కేసులు నమోదయ్యాయి.
Similar News
News October 10, 2025
త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లిస్తాం: లోకేశ్

AP: IT, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు త్వరలోనే పెండింగ్ రాయితీలు చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ అధికారులను ఆదేశించారు. ఆ శాఖపై సమీక్ష సందర్భంగా మాట్లాడుతూ.. ‘స్టార్టప్ల వృద్ధిలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలి. మరో 2 నెలల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వెయ్యి సేవలను అందుబాటులోకి తేవాలి’ అని అన్నారు. రేపు క్యాబినెట్ భేటీలో ప్రవేశపెట్టనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీపైనా చర్చించారు.
News October 9, 2025
AP న్యూస్ రౌండప్

* రేపు నెల్లూరు(D)లో CM చంద్రబాబు పర్యటన.. విశ్వ సముద్ర ఎథనాల్ ప్లాంట్, నందగోకులం లైఫ్ స్కూల్ ప్రారంభం
* కల్తీ మద్యంపై CBI విచారణ జరపాలి: MP మిథున్ రెడ్డి
* మెడికల్ కాలేజీలకు జగన్ ఒక్క రూపాయి కేటాయించలేదు: అచ్చెన్న
* పర్మిషన్లో రూటు మార్చినా జగన్ రూటే సెపరేటు: అంబటి
* మైనారిటీ యువతకు ఖతర్లో ఉద్యోగ అవకాశాలకు 13న విజయవాడలో ఎంపిక ఇంటర్వ్యూలు.. సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి ఫరూక్
News October 9, 2025
ట్రంప్కు నోబెల్ ఇవ్వకుంటే.. నార్వే భవిష్యతేంటి?

2025కు గాను నోబెల్ శాంతి బహుమతిని రేపు ప్రకటించనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. నార్వేజియన్ నోబెల్ కమిటీ విజేతను డిసైడ్ చేయనుంది. దీంతో నార్వే నేతలు, ప్రజల్లో ఆందోళన మొదలైంది. ట్రంప్ను నోబెల్ బహుమతికి ఎంపిక చేయకపోతే ఆ ప్రభావం US-నార్వే రిలేషన్స్పై పడుతుందని అభిప్రాయపడుతున్నారు. చైనా, భారత్ వంటి అగ్రదేశాలనే లెక్కచేయని ట్రంప్ తమపై కఠిన చర్యలు తీసుకునే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు.