News February 17, 2025
మేం ఏం చేస్తున్నామో తెలియాలంటే RSSలో చేరండి: మోహన్ భాగవత్

తాము ఏం చేస్తున్నామో తెలుసుకునేందుకు ప్రజలు తమ సంస్థలో సభ్యులుగా చేరాలని RSS చీఫ్ మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. బెంగాల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘బయటి నుంచి చూస్తూ అనేక అపోహల్ని చాలామంది నమ్ముతున్నారు. మీరు సంఘ్ గురించి తెలుసుకోవాలంటే ఒక్కసారి చేరి చూడండి. మేం చేసేది మీకు నచ్చకపోతే వదిలి వెళ్లిపోండి. చేరేందుకు సభ్యత్వ రుసుం, నిబంధనల్లాంటివేం లేవు’ అని వివరించారు.
Similar News
News November 25, 2025
ఈ దిగ్గజ మహిళా క్రికెటర్ గురించి తెలుసా?

ప్రస్తుత భారత మహిళా క్రికెట్ టీమ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. అయితే దీని వెనక డయానా ఎడుల్జీ పాత్ర ఎంతో ఉంది. 50 సంవత్సరాలకుపైగా క్రికెటర్గా, అడ్మినిస్ట్రేటర్గా ఎడుల్జీ భారత క్రికెట్కు సేవలు అందించారు. ఈమెను స్ఫూర్తిగా తీసుకుని అప్పట్లో చాలామంది అమ్మాయిలు క్రికెట్కు ఆకర్షితులై ఆటలోకి అడుగుపెట్టారు. ఎడమచేతి వాటం స్పిన్నర్ అయిన డయానా భారత్ తరఫున 54 మ్యాచ్లు ఆడి 109 వికెట్లు పడగొట్టారు.
News November 25, 2025
TG TET.. నేటి నుంచి ఎడిట్ ఆప్షన్

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) అప్లికేషన్ గడువు ఈ నెల 29తో ముగియనుంది. ఇప్పటివరకు 1,26,085 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఎడిట్ ఆప్షన్ నేటి నుంచి డిసెంబర్ 1 వరకు అందుబాటులో ఉండనుంది. సర్వీసులో ఉన్న టీచర్లూ టెట్లో అర్హత సాధించాల్సిందేనని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి దరఖాస్తుల సంఖ్య పెరిగింది.
వెబ్సైట్: <
News November 25, 2025
చలి తగ్గింది

బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత తగ్గింది. పలు జిల్లాల్లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నాయి. ఇవాళ తెల్లవారు జామున HYDలో 19 డిగ్రీలు, పటాన్చెరులో 15.8 డిగ్రీలు, ADBలో 15.7, మెదక్లో 14.3 డిగ్రీలు, ఏపీలోని అరకులో 12, పాడేరులో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగైదు రోజులు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.


