News March 17, 2024

రేపు BRSలో చేరుతున్నా: ప్రవీణ్ కుమార్

image

TG: ఇటీవల బీఎస్పీకి రాజీనామా చేసిన RS ప్రవీణ్‌కుమార్.. BRSలో చేరుతున్నట్లు ప్రకటించారు. ‘నా రాజకీయ భవితవ్యంపై శ్రేయోభిలాషులతో చర్చించా. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం రేపు కేసీఆర్ సమక్షంలో BRSలో చేరుతున్నాను. నేను ఎక్కడున్నా బహుజన మహనీయుల సిద్ధాంతాన్ని గుండెలో పదిలంగా దాచుకుంటా. వాళ్ల కలలను నిజం చేసే దిశగా పయనిస్తా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News September 30, 2024

తిరుమల లడ్డూ వివాదంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

image

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇవాళ విచారించనుంది. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ CM చంద్రబాబు చేసిన ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చాలని, ఇందుకోసం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ వేయాలని BJP సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేయించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

News September 30, 2024

జయసూర్య వచ్చాడు.. జయాలు తెచ్చాడు!

image

గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న శ్రీలంక క్రికెట్ టీమ్ ఇప్పుడు వరుస విజయాలు నమోదు చేస్తోంది. ఈ క్రెడిట్ సనత్ జయసూర్యదేనని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఆయన తాత్కాలిక హెడ్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి ఆ జట్టు INDపై ODI సిరీస్, ENGలో ENGపై టెస్టు మ్యాచ్, తాజాగా NZపై టెస్ట్ సిరీస్ గెలిచింది. దీంతో ఆ దేశ క్రికెట్‌లో కొత్త శకం మొదలైందని పలువురు క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

News September 30, 2024

కేంద్రం బెంగాల్‌ను పట్టించుకోవడం లేదు: సీఎం మమత

image

కేంద్ర ప్రభుత్వం తమ రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తాజాగా ఆరోపించారు. రాష్ట్రంలో ప్రకృతి విపత్తులకు కేంద్రం నుంచి ఎటువంటి చేయూత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఉత్తర బెంగాల్ అల్లకల్లోలంగా ఉంది. పలు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కేంద్రం మాకు ఏమాత్రం సాయం చేయడం లేదు. బీజేపీ నేతలకు ఎన్నికలప్పుడు మాత్రమే బెంగాల్ గుర్తొస్తుంది’ అని మండిపడ్డారు.