News April 5, 2024

సాయంత్రం టీడీపీలో చేరుతున్నా: RRR

image

AP: తాను టీడీపీలో చేరబోతున్నట్లు ఎంపీ రఘురామకృష్ణరాజు ట్వీట్ చేశారు. ఈ రోజు సాయంత్రం పాలకొల్లులో జరగనున్న ‘ప్రజాగళం’ సభలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నానని ప్రకటించారు. ప్రజలందరూ బీజేపీ-టీడీపీ-జనసేన కూటమికి మద్దతు తెలిపి, ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నానని చెప్పారు. RRRకు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News December 27, 2025

AIIMS రాయపుర్‌లో 100 సీనియర్ రెసిడెంట్స్ పోస్టులు

image

<>AIIMS <<>>రాయపుర్‌ 100 Sr. రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBBS, MD/MS/DNB/డిప్లొమా ఉత్తీర్ణులు JAN 6 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, మహిళలు, SC,ST, PwBDలకు ఫీజు లేదు. నెలకు రూ. 67,000+అలవెన్సులు చెల్లిస్తారు. https://www.aiimsraipur.edu.in

News December 27, 2025

వరుసగా 5 సెంచరీలతో రికార్డు

image

విజయ్ హజారే ట్రోఫీలో విదర్భ బ్యాటర్ ధ్రువ్ షోరే రికార్డు సృష్టించారు. హైదరాబాద్‌తో రాజ్‌కోట్‌లో నిన్న జరిగిన మ్యాచ్‌లో 77 బంతుల్లో అజేయంగా 109 పరుగులు (9 ఫోర్లు, 6 సిక్స్‌లు) చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించారు. దీంతో లిస్ట్-A క్రికెట్‌లో వరుసగా 5 సెంచరీలు సాధించిన రెండో బ్యాటర్‌గా తమిళనాడు ప్లేయర్ జగదీశన్ రికార్డును సమం చేశారు. ఈ మ్యాచ్‌లో విదర్భ 365 రన్స్ చేయగా, హైదరాబాద్ 276కే పరిమితమైంది.

News December 27, 2025

10 రోజుల్లో ఏ రోజు దర్శించుకున్నా అదే ఫలితం: TTD EO

image

AP: వైకుంఠ ద్వార దర్శనాలపై భక్తులు ఆందోళన చెందవద్దని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని, ఆ పవిత్ర రోజుల్లో ఏ రోజు స్వామిని దర్శించుకున్నా అదే ఫలితం లభిస్తుందని పండితులు చెప్పారని పేర్కొన్నారు. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సమయాన్ని సామాన్య భక్తులకే కేటాయించామని వివరించారు.