News January 29, 2025

పెద్దిరెడ్డిపై విచారణకు జాయింట్ కమిటీ

image

AP: మాజీ మంత్రి పెద్దిరెడ్డి అటవీభూముల <<15298493>>ఆక్రమణల<<>> ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. CM చంద్రబాబు ఆదేశాల మేరకు జాయింట్ కమిటీ ఏర్పాటు చేసింది. చిత్తూరు కలెక్టర్ సుమిత్, SP, IFS అధికారి యశోదాను కమిటీలో సభ్యులుగా నియమించారు. జాయింట్ కమిటీ దర్యాప్తు నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. అటు, పెద్దిరెడ్డి భూఆక్రమణలపై విచారణకు Dy.CM పవన్ ఆదేశించిన విషయం తెలిసిందే.

Similar News

News January 22, 2026

ఈ నెల 30న ఓటీటీలోకి ‘ధురంధర్’!

image

అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ త్వరలోనే ఓటీటీ అభిమానులను అలరించనుంది. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ధురంధర్ చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ మొత్తం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మీరూ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా?

News January 22, 2026

ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

image

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్‌ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.

News January 22, 2026

500 వికెట్లు.. జలజ్ సక్సేనా రికార్డు

image

మహారాష్ట్ర ప్లేయర్ జలజ్ సక్సేనా (39 Yrs) దేశవాళీ క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించారు. ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకుండానే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. పుణెలో గోవాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి ఈ మైలురాయిని అందుకున్నారు. అదే విధంగా 156 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 7,202 పరుగులు సైతం చేశారు. జలజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్‌లో 18 మంది 500 వికెట్లు తీశారు.