News December 20, 2024
39 మందితో జేపీసీ.. ఏ పార్టీ నుంచి ఎంత మంది?

జమిలి బిల్లుపై అధ్యయనం చేసేందుకు పీపీ చౌదరి అధ్యక్షతన ఏర్పాటైన <<14936882>>జేపీసీలో<<>> మొత్తం 39 మందికి చోటు దక్కింది. ఇందులో 16 మంది బీజేపీ, ఐదుగురు కాంగ్రెస్ ఎంపీలున్నారు. ఎస్పీ, టీఎంసీ, డీఎంకే నుంచి ఇద్దరు చొప్పున ఎంపిక చేశారు. టీడీపీ, జనసేన, వైసీపీ, శివసేన, జేడీయూ, ఆర్ఎల్డీ, ఎల్జేఎస్పీ(ఆర్వీ), శివసేన(యూబీటీ), ఎన్సీపీ-ఎస్పీ, ఆప్, బీజేడీ, సీపీఐ(ఎం) తరఫున ఒక్కో సభ్యుడికి అవకాశం దక్కింది.
Similar News
News December 31, 2025
నువ్వుల పంటలో ఆకు, కాయ తొలుచు పురుగు-నివారణ

ఈ పురుగు తొలి దశలో చిన్న చిన్న గొంగళి పురుగులు లేత ఆకులను కలిపి గూడు ఏర్పాటు చేసుకొని లోపలి నుంచి ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గోకి తినడం వల్ల ఆకులు ఎండిపోతాయి. ఈ పురుగులు ఆకులనే కాకుండా మొగ్గలు, పువ్వులతో పాటు కాయలోని గింజలను కూడా తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటికి క్వినాల్ఫాస్ 20ml లేదా క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.
News December 31, 2025
సీరియల్ నటి ఆత్మహత్య.. కారణమిదే!

సీరియల్ నటి నందిని(26) <<18707144>>ఆత్మహత్య<<>>కు పాల్పడిన ఘటనలో సూసైడ్ లెటర్ వెలుగు చూసింది. తనకు ప్రభుత్వ ఉద్యోగం చేయడం ఇష్టం లేదని, నటన అంటే ఇష్టమని ఆమె లేఖలో పేర్కొన్నారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడం మరణానికి కారణమని తెలిపారు. కాగా నందిని తండ్రి(ప్రభుత్వ ఉద్యోగి) 2023లో మరణించారు. దీంతో ఆ ఉద్యోగం చేయాలని నందినిపై కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు.
News December 31, 2025
అంతిమ యాత్ర తర్వాత వెనక్కి ఎందుకు చూడకూడదు?

శరీరం దహనమైనా ఆత్మ ఉనికిలోనే ఉంటుందట. తన కుటుంబంతో ఉన్న అనుబంధం కోసం ఎదురు చూస్తూ ఉంటుందట. గరుడ పురాణం ప్రకారం.. శ్మశానం నుంచి వెనుదిరిగేటప్పుడు వెనక్కి చూస్తే, ఆత్మకు బంధువులపై మమకారం పెరిగి ఈ లోకాన్ని విడిచి వెళ్లడం కష్టమవుతుందని నమ్ముతారు. ఆత్మ తన పాత గుర్తింపు వదిలి కొత్త ప్రయాణం ప్రశాంతంగా మొదలుపెట్టాలనే ఉద్దేశంతోనే, బంధాన్ని తెంచుకుంటూ ఎవరూ వెనక్కి తిరిగి చూడకూడదని అంటారు.


