News March 29, 2025

JRG: స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి 

image

జంగారెడ్డిగూడెం (M) కొంగువారిగూడెం కెకెఎం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వంశీ (25), వంశీ కృష్ణ(23) ఇద్దరు యువకులు శనివారం జలాశయం ప్రాంతానికి వెళ్లారు. కాలువలోకి స్నానానికి దిగిన వీరిద్దరూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News February 26, 2026

RRRను సీబీఐ అరెస్ట్ చేయాలి.. ఐపీఎస్ డిమాండ్!

image

ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు(RRR) బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టారని ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఆరోపించారు. ఈ కుంభకోణాలపై ఇప్పటికే సీబీఐ కేసులు ఉన్నాయని, ఆయన బయట ఉంటే సాక్షులను భయపెట్టి కేసులను పక్కదారి పట్టించే అవకాశం ఉందని గురువారం పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని, రఘురామను వెంటనే అరెస్ట్ చేసి విచారించాలని ట్విట్టర్ వేదికగా ఆయన డిమాండ్ చేశారు.

News February 26, 2026

చిత్తూరులో ఆ అధికారులంతా ట్రాన్స్‌ఫర్

image

2018 గ్రూప్-1 బ్యాచ్ అధికారులను ప్రాధాన్యత పోస్టుల నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 26 మంది RDOలు, 25 మంది DSPలను బదిలీ చేస్తూ హెడ్ క్వార్టర్స్ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో చిత్తూరు జిల్లా కుప్పం, నగరి RDOలు శ్రీనివాసులు రాజు, భవాని శంకరి, నగరి DSP మహమ్మద్ అజీజ్, సాంఘిక సంక్షేమశాఖ DD విక్రమ్ కుమార్ రెడ్డి బదిలీ అయ్యారు

News February 26, 2026

సిరిసిల్ల: అదనపు కలెక్టర్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు

image

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధుల్లో తొలి రోజు నుంచి ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన గరీమా అగ్రవాల్ ఇదే జిల్లాకు కలెక్టర్ కావడం విశేషం. 2025 అక్టోబర్ 23న స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా విధుల్లో చేరిన ఆమె.. అప్పటి కలెక్టర్ ఎం.హరిత సెలవుపై వెళ్లడంతో 4 నెలలుగా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమితులయ్యారు.