News February 8, 2025

JRG: 8వ తరగతి బాలికపై అత్యాచారం

image

జంగారెడ్డిగూడెం(M) ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI జబీర్ తెలిపారు. SI వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఈ నెల 5న ఇంటికి వెళ్తుండగా శ్యామ్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. బాలిక కుటుంబీకులకు విషయం చెప్పడంతో వారు నిన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News December 25, 2025

అమరావతి రైల్వే లైన్.. మరో 300 ఎకరాల సేకరణ

image

ఎరుపాలెం-అమరావతి-నంబూరు బ్రాడ్ గేజ్ లైన్ పనుల్లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మరో 300 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీరుల్లపాడు, కంచికచర్ల మండలాల్లోని 8 గ్రామాల్లో ఈ భూమిని సేకరించనున్నారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్, అసైన్డ్ భూములు ఉన్నాయి. 56.53 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు అమరావతికి రైలు మార్గం కల్పించడంలో కీలకమని అధికారులు అంటున్నారు.

News December 25, 2025

ఇతిహాసాలు క్విజ్ -107 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: తన పరమ భక్తుడిని రక్షించడం కోసం ఓ దేవుడు ఒకే సమయంలో అటు మనిషిగా కాకుండా, ఇటు జంతువుగా కాకుండా సగం మానవ, సగం మృగం రూపాన్ని ధరించాడు. ఆ దేవుడెవరు? ఆయన ఎవరిని రక్షించారు?
సమాధానం: ఆయన శ్రీమహావిష్ణువు ధరించిన నరసింహ అవతారం. తన భక్తుడైన ప్రహ్లాదుడిని తండ్రి హిరణ్యకశిపుడి క్రూరత్వం నుంచి కాపాడటానికి స్వామి ఈ రూపం దాల్చారు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 25, 2025

బిజినేపల్లి: ఆలయ అర్చకునిపై దాడి

image

బిజినేపల్లి మండలంలోని పాలెంలో అభయ ఆంజనేయస్వామి ఆలయ అర్చకుడు ఖానాపురం సురేష్ శర్మపై అకారణంగా దాడి జరగింది. ఆలయ స్థలదాత రెడ్డి వెంకటేశ్వర రెడ్డి తనపై దాడి చేశారని అర్చకుడు ఆరోపిస్తూ ఆలయ ప్రాంగణంలో ఆందోళనకు దిగారు. అర్చకుడికి మద్దతుగా గ్రామ యువకులు తరలిరావడంతో ఉద్రిక్తత నెలకొంది. డీఎస్పీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.