News February 8, 2025

JRG: 8వ తరగతి బాలికపై అత్యాచారం

image

జంగారెడ్డిగూడెం(M) ఓ గ్రామానికి చెందిన వ్యక్తి అత్యాచారం చేసిన ఘటనలో బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు SI జబీర్ తెలిపారు. SI వివరాల ప్రకారం.. 8వ తరగతి చదువుతున్న బాలికపై ఈ నెల 5న ఇంటికి వెళ్తుండగా శ్యామ్ అనే వ్యక్తి మాయ మాటలు చెప్పి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారన్నారు. బాలిక కుటుంబీకులకు విషయం చెప్పడంతో వారు నిన్న ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News July 7, 2025

తెలంగాణలో ‘జాగీర్’ ఫైట్!

image

‘తెలంగాణ BRS జాగీరా?’ అని ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ కోసం పోరాడింది BRS అని, తెలంగాణ తమ జాగీరే అని ఆ పార్టీ నేతలు పోస్టులు చేస్తున్నారు. ఆంధ్ర పత్రికలు మరోసారి విషం చిమ్ముతున్నాయని ఫైరవుతున్నారు. అయితే BRSని విమర్శిస్తే తెలంగాణను తిట్టినట్లు కాదని కాంగ్రెస్ నేతలు కౌంటరిస్తున్నారు. మళ్లీ సెంటిమెంటును రెచ్చగొడుతున్నారని మండిపడుతున్నారు. దీనిపై మీ కామెంట్?

News July 7, 2025

కడుపులో పెన్నులు.. బయటకు తీసిన వైద్యులు

image

నరసరావుపేటకి చెందిన 28 ఏళ్ల యువతి కడుపులో ఉన్న నాలుగు పెన్నులను వైద్యుడు రామచంద్రారెడ్డి శస్త్ర చికిత్స చేసి వెలికి తీశారు. వాంతులతో వైద్యశాలకు చేరిన యువతకి సిటీ స్కాన్ చేయడం ద్వారా నాలుగు పెన్నులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ విధానంలో ఎటువంటి కోత, కుట్లు లేకుండా వైద్యులు ఈ అరుదైన శాస్త్ర చికిత్స చేశారు.

News July 7, 2025

బ్యాటింగ్, బౌలింగ్ అదరగొట్టారుగా..

image

రెండో టెస్టులో ఇంగ్లండ్‌పై గెలుపుతో గిల్ కెప్టెన్‌గా విజయాల ఖాతా తెరిచారు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత జట్టుకు ఇదే తొలి విజయం. ఈ మైదానంలో ఆడిన గత 8 మ్యాచుల్లో ఏడు ఓడిపోగా ఒక మ్యాచును డ్రా చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్, రెండో ఇన్నింగ్సులో ఆకాశ్ దీప్ ఆరేసి వికెట్లతో అదరగొట్టారు. అటు కెప్టెన్ గిల్ 430 పరుగులతో మరిచిపోలేని ప్రదర్శన చేశారు. జడేజా, పంత్, జైస్వాల్, రాహుల్ తమ వంతు పాత్ర పోషించారు.