News March 29, 2025

JRG: స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృతి 

image

జంగారెడ్డిగూడెం (M) కొంగువారిగూడెం కెకెఎం ఎర్రకాలువ జలాశయం కుడి కాలువలో స్నానానికి దిగిన ఇద్దరు యువకులు మృతి చెందారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వంశీ (25), వంశీ కృష్ణ(23) ఇద్దరు యువకులు శనివారం జలాశయం ప్రాంతానికి వెళ్లారు. కాలువలోకి స్నానానికి దిగిన వీరిద్దరూ ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ధర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Similar News

News April 2, 2025

పోలీసులతో బెదిరించినా తెగువ చూపారు.. హ్యాట్సాఫ్: YS జగన్

image

AP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో కూటమి నేతలు అధికార అహంకారంతో ఎలాగైనా గెలవాలని చూశారని YCP అధినేత జగన్ అన్నారు. ‘రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని నేను. ఉప ఎన్నికల్లో మన కార్యకర్తలు చూపిన తెగువ, ధైర్యానికి హ్యాట్సాఫ్. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాలు గెలిచాం. TDPకి సంఖ్యా బలం లేకున్నా పోలీసులతో బెదిరించారు’ అని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల భేటీలో వ్యాఖ్యానించారు.

News April 2, 2025

స్టూడెంట్ తండ్రికి టీచర్ ముద్దులు.. చివరకు..

image

బెంగళూరులో శ్రీదేవి అనే ప్రీ స్కూల్ టీచర్ ఓ విద్యార్థిని తండ్రిని డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేసింది. తొలుత అతడి వద్ద నుంచి రూ.4లక్షలు అప్పుగా తీసుకున్న ఆమె, ఆ తర్వాత అతడితో ఏకాంతంగా గడిపింది. అతడికి ముద్దు పెట్టిన ఫొటోలు, వీడియో చాట్‌లను బయటపెడతానంటూ విడతల వారీగా డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో చివరకు బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు శ్రీదేవి, ఆమె ప్రియుడు సాగర్, రౌడీ షీటర్ గణేశ్‌‌ను అరెస్ట్ చేశారు.

News April 2, 2025

శుభకార్యాల వేళ హిజ్రాల దోపిడీని అరికట్టేదెలా?

image

హైదరాబాద్‌లో హిజ్రాల దోపిడీ పెరిగిపోయింది. ఫంక్షన్ ఏదైనా ఇంట్లోకి వచ్చేసి డబ్బులు డిమాండ్ చేస్తూ బంధువుల ముందు పరువు తీస్తున్నారని నగరవాసులు SMలో వాపోతున్నారు. తాజాగా కూకట్‌పల్లిలో ఓ ఇంట్లో పూజ జరుగుతుండగా అక్కడికి వచ్చి రూ.8వేలు వసూలు చేశారు. ఆ తర్వాత ఇంటి గుమ్మానికి తమ సంతకం చేసి వెళ్లిపోయారు. ఇలాంటి ఘటనలపై పోలీసులకు ఫిర్యాదులందినా, చర్యలు లేవని నెట్టింట విమర్శలొస్తున్నాయి.

error: Content is protected !!