News October 6, 2025

జూబ్లీహిల్స్ బైపోల్.. కాంగ్రెస్ టికెట్ దక్కేదెవరికి?

image

TG: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరికి ఇస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఏఐసీసీకి పీసీసీ ముగ్గురి పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, CN రెడ్డి పేర్లు ఉన్నట్లు సమాచారం. అయితే పార్టీ సీనియర్ నేత అంజన్ కుమార్ యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. మరి వీరిలో ఎవరు ఉపఎన్నిక బరిలో నిలుస్తారో చూడాలి.

Similar News

News October 6, 2025

ఫైల్స్ వికేంద్రీకరణ.. మొదలుపెట్టిన మంత్రి సత్య

image

AP ఆరోగ్యమంత్రి సత్యకుమార్ ఫైల్స్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. నిర్ణయాలు, పనుల్లో వేగం పెంచేందుకు ప్రతి ఫైల్ తనకు చేరనవసరం లేదన్నారు. 28 అంశాల్లో తన శాఖ CS, తదితర ఉన్నతాధికారులకు డిసిషన్ పవర్ ఇచ్చారు. CM, కేబినెట్ నిర్ణయాలు, పాలసీలు, విజిలెన్స్ నివేదికలు, స్టాఫ్ సర్వీస్, విభజన అంశాలు, కేంద్రంతో సంప్రదింపులు, కాలేజీలు, హాస్పిటల్స్ ఏర్పాటు వంటి కీలక 17 విషయాల ఫైల్స్ తనకు పంపాలన్నారు.

News October 6, 2025

వీటితో స్నానమాచరిస్తే.. అదృష్టం మీవెంటే!

image

పచ్చి పాలు: ఆయుష్షు పెరుగుతుంది.
ఉప్పు: చేయాల్సిన పనులు వెంటనే పూర్తవుతాయి.
యాలకులు: శుభ ఫలితాలు ఉంటాయి.
పసుపు: ఆరోగ్యంగా ఉంటారు. చర్మవ్యాధులు తగ్గుతాయి.
రోజ్ వాటర్: మీ పట్ల ఎదుటివారికి ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి.
ఆవనూనె: శని గ్రహ దుష్ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.
గంగాజలం: పాపాలు తొలగిపోతాయి. శరీరం శుద్ధి అవుతుంది.

News October 6, 2025

DRDOలో 50 పోస్టులు

image

DRDO ఆధ్వర్యంలోని ప్రూప్& ఎక్స్‌పెరిమెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ 50 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. BE/బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 19వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NATSలో ఎన్‌రోల్ చేసుకోవాలి. మార్కుల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ/ రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.12,300, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.10,900 చెల్లిస్తారు.