News March 24, 2024
జడ్జి ఆత్మహత్య

TG: కుటుంబ కలహాలతో నాంపల్లి కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆత్మహత్య చేసుకున్నారు. అంబర్పేట బతుకమ్మ కుంటలోని పోచమ్మ బస్తీలో శ్రీనిధి రెసిడెన్సీలో నివాసం ఉంటున్న జస్టిస్ మణికంఠ(36) ఇంట్లో సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. భార్యతో మనస్పర్థల కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. కేసు దర్యాప్తులో ఉంది.
Similar News
News November 24, 2025
రైజింగ్ స్టార్స్ కప్ గెలిచిన పాక్.. INDపై ట్రోల్స్!

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ విజేతగా PAK A నిలిచింది. ACC ఛైర్మన్ నఖ్వీ ఆ జట్టుకు ట్రోఫీ అందించగా, ఆ ఫొటోలు పోస్ట్ చేస్తూ PAK ఫ్యాన్స్ టీమ్ ఇండియాను ట్రోల్ చేస్తున్నారు. ‘పక్క దేశం వాళ్లకు ఇది ఇంకా నెరవేరని కలే’ అంటూ పోస్టులు పెడుతున్నారు. వాటికి IND ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. కాగా SEPలో ఆసియా కప్ గెలిచిన అనంతరం నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని తీసుకునేందుకు IND నిరాకరించిన సంగతి తెలిసిందే.
News November 24, 2025
ఏపీలో లోకల్ బాడీ ఎన్నికలపై అప్డేట్

APలో పంచాయతీ పాలక వర్గాలకు 2026 MAR వరకు గడువుండగా, MPTC, ZPTCల పదవీకాలం SEPతో ముగియనుంది. FEB, MARలో SSC, ఇంటర్ పరీక్షలు ఉండటంతో ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరగొచ్చు. పరిషత్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం SEP/OCTలో జరగొచ్చని అంచనా. కాగా రిజర్వేషన్ల ఖరారు కోసం వచ్చే నెలలో ప్రభుత్వం డెడికేషన్ కమిషన్ను ఏర్పాటు చేయనుంది. అధ్యయనం, అభిప్రాయ సేకరణ అనంతరం కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారవుతాయి.
News November 24, 2025
ఇంట్లో శివలింగం ఉంటే.. ఈ నియమాలు తప్పనిసరి

ఎత్తైన శివలింగాన్ని ఇంట్లో ప్రతిష్ఠిస్తే కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు.
☛ లింగం నుంచి నిత్యం శక్తి విడుదలవుతూ ఉంటుంది. కాబట్టి పైనుంచి చిన్న నీటి ప్రవాహమైనా ఉండాలి. ☛ రోజూ సాత్విక నైవేద్యం పెట్టాలి. ☛ ఇంట్లో మాంసాహారం వండకూడదు. ఇంట్లో వారెవరూ మద్యమాంసాలు ముట్టుకోకూడదు. ☛ ఓ ఇంట్లో 2 లింగాలను ప్రతిష్ఠించకూడదు. ☛ శివలింగం ఉన్న పూజా మందిరం పవిత్రంగా, పరిశుభ్రంగా ఉండాలి.


