News January 20, 2025
₹17 లక్షల పరిహారం ఇవ్వాలన్న జడ్జి.. అవసరం లేదన్న పేరెంట్స్

ట్రైనీ వైద్యురాలి హత్యాచార కేసు తీర్పు వెల్లడించిన న్యాయమూర్తి అనిర్బన్ దాస్ పరిహారంపై సైతం ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి బెంగాల్ ప్రభుత్వం రూ.17 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పులో పేర్కొన్నారు. అత్యంత అరుదైన ఈ కేసులో ఉరి శిక్ష విధించాలని CBI లాయర్ వాదించారు. కానీ దీన్ని అత్యంత అరుదైన కేసుగా పరిగణించలేమని జడ్జి తెలిపారు. అటు తమకు పరిహారం అవసరం లేదని అభయ తండ్రి ప్రకటించారు.
Similar News
News December 21, 2025
కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నారా?

అకారణంగా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? భాగస్వామితో మనస్పర్థలున్నాయా? దీనివల్ల ప్రశాంతత కరవవుతోందా? దీనికి గ్రహ గతులు సరిగా లేకపోవడం, వాస్తు దోషాలే కారణమవ్వొచ్చు! దీని నివారణకు రోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం శుభాన్నిస్తుంది. సోమవారాలు శివాలయానికి వెళ్లడం మంచిది. అభిషేకంతో అధిక ఫలితముంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి, ఇల్లు ఆనందమయంగా మారుతుంది.
News December 21, 2025
నేడే ఫైనల్.. వీళ్లు చెలరేగితే విజయం ఖాయం!

అండర్-19 ఆసియా కప్ వన్డే టోర్నీ ఆఖరి మజిలీకి చేరుకుంది. టీమ్ ఇండియా యంగ్స్టర్స్ నేడు దాయాది దేశంతో తలపడనున్నారు. ఇవాళ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు మరోసారి చెలరేగితే భారత్కు విజయం సునాయాసం అవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమ్ ఇండియా అన్ని గ్రూప్ మ్యాచుల్లో గెలిచింది. సెమీస్లో అయితే శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇప్పటికే పాక్ను ఒకసారి 90 రన్స్ తేడాతో ఓడించింది.
News December 21, 2025
జాగ్రత్త.. వణికించేస్తున్న చలి

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. నిన్న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉ.8.30 గంటల వరకు బయటకు రావొద్దని IMD 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత 4.7 డిగ్రీలుగా నమోదైంది. అరకులో 5.8, పాడేరులో 6.7, డుంబ్రిగుడలో 9.1గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


