News June 27, 2024
రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా తీర్పిచ్చారు: రాష్ట్రపతి

కొత్తగా ఎన్నికైన ఎంపీలకు రాష్ట్రపతి ముర్ము అభినందనలు తెలిపారు. ‘ఎన్నికలు నిర్వహించిన ఈసీకి అభినందనలు. దేశ ప్రజలు మూడోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ ఆధారంగా తీర్పిచ్చారు. పదేళ్ల పాలనలో గ్రామీణ వ్యవస్థ పరిపుష్టమైంది. పెట్టుబడులు, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం. రైతుల కోసం ప్రభుత్వం నిరంతరాయంగా పని చేస్తోంది’ అని పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించారు.
Similar News
News April 19, 2026
ఖమేనీ ఖననంపై నో క్లారిటీ?

ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ <<19268847>>హతమై<<>> దాదాపు రెండు నెలలు కావస్తున్నా ఆయన అంత్యక్రియలు ఇంకా జరగలేదు. యుద్ధం, భద్రత సహా నిర్వహణలో సవాళ్లే ఇందుకు కారణమని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ప్రభుత్వ లాంఛనాలతో భారీ ఊరేగింపు మధ్య నిర్వహించాలని ఇరాన్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవడంతో అంత్యక్రియలను వాయిదా వేస్తోంది. కాగా ఖమేనీ కుమారుడు మొజ్తబా కూడా ఈ దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారు.
News April 19, 2026
KKRతో మ్యాచ్.. RR బ్యాటింగ్

ఈడెన్ గార్డెన్స్ వేదికగా KKRతో జరగనున్న మ్యాచులో టాస్ గెలిచిన RR కెప్టెన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నారు.
RR: జైస్వాల్, వైభవ్, జురెల్, పరాగ్, హెట్మెయర్, ఫెరీరా, జడేజా, ఆర్చర్, బర్గర్, బ్రిజేష్, రవి బిష్ణోయ్
KKR: సీఫెర్ట్, రహానే, గ్రీన్, పావెల్, రింకూ సింగ్, నరైన్, రమణ్దీప్, అనుకుల్, వైభవ్ అరోరా, కార్తీక్, వరుణ్
News April 19, 2026
కోతుల బెడద.. ఇంటికి రూ.500 వసూలు చేసి..

TG: ప్రస్తుతం ప్రతీ గ్రామాన్ని కోతుల సమస్య వేధిస్తోంది. కోతులు ఇళ్లలోకి చొరబడుతుండటం, మనుషులపై దాడులు చేస్తుండటం గ్రామస్థులను కలవరపెడుతోంది. దీని పరిష్కారం కోసం మహబూబాబాద్(D) నర్సింహులపేటలో గ్రామస్థులంతా ఏకమై చందాలు సేకరించారు. ‘కోతుల తరలింపు కార్యక్రమం’ పేరిట ఇంటికి రూ.500, ఎకరానికి రూ.500 చొప్పున వసూలు చేశారు. నిపుణుల బృందంతో కోతులను పట్టించి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు.


