News June 30, 2024
రేపు MLC కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు!

ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న BRS MLC కవిత బెయిల్ పిటిషన్పై రేపు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. జస్టిస్ స్వర్ణ కాంత శర్మతో కూడిన ధర్మాసనం ముందు ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించనున్నారు. కాగా ఈ కేసులో కవితను మార్చి 15న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయగా ఆమె తిహార్ జైలులో ఉన్నారు.
Similar News
News November 8, 2025
రాజ్తో ఫొటో వైరల్.. సమంత రెండో పెళ్లిపై చర్చ!

సమంత నిన్న రాజ్ నిడిమోరుతో క్లోజ్గా ఉన్న <<18228781>>ఫొటోను<<>> షేర్ చేయడంతో పెళ్లి ఎప్పుడనే చర్చ మొదలైంది. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్ నుంచి సమంత, రాజ్ స్నేహం మొదలైంది. అప్పటినుంచి వీరిద్దరూ డేట్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు రాజ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నారని బాలీవుడ్ మీడియా ఎప్పటినుంచో కోడై కూస్తోంది.
News November 8, 2025
రబీ వరి సాగు విధానం.. విత్తన మోతాదు

☛ నారు నాటే పద్ధతి – 20 కిలోల విత్తనం అవసరం.
☛ ఎద పద్ధతి – 12-15 కిలోలు(మండి కట్టిన విత్తనం), 25-30 కిలోలు( పొడి విత్తనం)
☛ శ్రీవరి సాగు పద్ధతి – 2 కిలోల విత్తనం అవసరం.
☛ యాంత్రిక పద్ధతిలో వరి సాగుకు 10-12 కిలోల విత్తనం
☛ బెంగాల్ పద్ధతిలో వరి సాగు 8-10 కిలోల విత్తనం కావాలి.
☛ నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. కిలో పొడి విత్తనాలకు 3గ్రాముల కార్బండిజమ్తో శుద్ధి చేయాలి.
News November 8, 2025
ఆలయాల్లో డిజిటల్ సేవలు.. 100 కియోస్క్ల ఏర్పాటు

AP: రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో డిజిటల్ సేవలను పెంచాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. దర్శనం, సేవల టికెట్లను సులభంగా పొందేలా 100 కియోస్క్లను ఏర్పాటుచేయనుంది. దీనివల్ల కౌంటర్ల వద్ద రద్దీ తగ్గనుంది. సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, ఇంద్రకీలాద్రి, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తితోపాటు అరసవిల్లి, మహానంది, కసాపురం, కదిరి లక్ష్మీనరసింహస్వామి తదితర 15 ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.


