News November 25, 2024
పట్నం నరేందర్రెడ్డి పిటిషన్పై తీర్పు రిజర్వ్

TG: మాజీ MLA పట్నం నరేందర్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. లగచర్ల ఘటనకు సంబంధించి తనపై 3 కేసులు నమోదు చేశారని ఆయన కోర్టును ఆశ్రయించారు. ఒక ఘటనపై వేర్వేరు కేసులు నమోదు చేయొద్దని సుప్రీం తీర్పులను పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తావించారు. దాడి ఆధారంగా పోలీసులు ఆ కేసులు నమోదు చేశారని ఏఏజీ కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Similar News
News October 19, 2025
HOT TOPIC: మావోయిస్టులతో నేతల సంబంధాలు?

TG: కొంత మంది రాజకీయ నాయకులు మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్నారన్న బీజేపీ నేతలు బండి సంజయ్, రాంచందర్ రావు కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. మావోయిస్టుల సాయుధ నెట్వర్క్లకు మద్దతు ఇస్తున్నారని, వెంటనే తమ సంబంధాలను తెంచుకోవాలని కేంద్రమంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. మావోయిస్టులతో సంబంధాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని బీజేపీ చీఫ్ డిమాండ్ చేశారు. దీంతో ఆ నేతలెవరనే చర్చ మొదలైంది.
News October 19, 2025
APPLY NOW: BELలో 176 ఉద్యోగాలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)176 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ -సి పోస్టులు ఉన్నాయి. వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిప్లొమా(ఇంజినీరింగ్), టెన్త్+ ITI అర్హతగల అభ్యర్థులు నవంబర్ 4 వరకు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://bel-india.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 40 సమాధానాలు

1. వాల్మీకి రామాయణంలో మొత్తం ‘24 వేల’ శ్లోకాలు ఉన్నాయి.
2. ‘యముడి’ అనుగ్రహం వల్ల కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు.
3. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని ‘మాస శివరాత్రి’ అని అంటారు.
4. హనుమాన్ చాలీసాను రచించిన భక్తుడు ‘తులసీదాస్’.
5. భద్రాచలం రాముడి ఆలయాన్ని నిర్మించింది ‘కంచర్ల గోపన్న’.
<<-se>>#Ithihasaluquiz<<>>