News January 29, 2025

కుంభమేళా తొక్కిసలాటపై న్యాయ విచారణ

image

ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో ఇవాళ జరిగిన <<15303488>>తొక్కిసలాట<<>>పై న్యాయ విచారణ జరిపిస్తాం అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. జస్టిస్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఇవాళ అర్ధరాత్రి తర్వాత జరిగిన తొక్కిసలాటలో 30మంది మృతి చెందినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News November 17, 2025

IPLలోనే కెప్టెన్సీ ఒత్తిడి ఎక్కువ: KL రాహుల్

image

IPLలో క్రీడలతో సంబంధంలేని వారికీ కెప్టెన్ వివరణలు ఇవ్వాల్సి ఉంటుందని DC బ్యాటర్ KL రాహుల్ తెలిపారు. ’10 నెలల ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన దానికంటే 2 నెలల IPLకే ఎక్కువ అలసిపోయాను. కెప్టెన్‌గా చాలా కష్టపడ్డాను. సమీక్షల్లో పాల్గొనాలి, యాజమాన్యానికి వివరణివ్వాలి. కోచ్‌లు, కెప్టెన్లను ఎన్నో ప్రశ్నలడుగుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అలా ఉండదు. ఆట తెలిస్తే ఎలా ఫెయిలయ్యామో చెప్తే అర్థమవుతుంది’ అని తెలిపారు.

News November 17, 2025

IPLలోనే కెప్టెన్సీ ఒత్తిడి ఎక్కువ: KL రాహుల్

image

IPLలో క్రీడలతో సంబంధంలేని వారికీ కెప్టెన్ వివరణలు ఇవ్వాల్సి ఉంటుందని DC బ్యాటర్ KL రాహుల్ తెలిపారు. ’10 నెలల ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన దానికంటే 2 నెలల IPLకే ఎక్కువ అలసిపోయాను. కెప్టెన్‌గా చాలా కష్టపడ్డాను. సమీక్షల్లో పాల్గొనాలి, యాజమాన్యానికి వివరణివ్వాలి. కోచ్‌లు, కెప్టెన్లను ఎన్నో ప్రశ్నలడుగుతారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అలా ఉండదు. ఆట తెలిస్తే ఎలా ఫెయిలయ్యామో చెప్తే అర్థమవుతుంది’ అని తెలిపారు.

News November 17, 2025

డిసెంబర్ రెండో వారంలో సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్?

image

స్థానిక సంస్థల ఎన్నికలకు TG ప్రభుత్వం సిద్ధమవుతోంది. DEC రెండో వారంలో షెడ్యూల్ ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలుత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి, అనంతరం MPTC, ZPTC ఎలక్షన్స్‌కు వెళ్లాలని సర్కార్ యోచిస్తోంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టపరంగా ఆటంకం ఏర్పడటంతో పార్టీ పరంగానే రిజర్వేషన్లు అమలు చేసే అవకాశం ఉంది.