News April 25, 2024

ఇవాళ్టి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ

image

TG: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఇవాళ్టి నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ ఇవాళ మధ్యాహ్నం కోల్‌కతా నుంచి HYD రానున్నారు. 27వ తేదీ వరకు విచారణ చేపట్టనున్న ఆయన.. ఒకరోజు మేడిగడ్డ బ్యారేజీని కూడా సందర్శించనున్నారు. విచారణ కోసం కావాల్సిన సాంకేతిక, న్యాయపరమైన సిబ్బందిని ఆయన నియమించుకోనున్నారు.

Similar News

News November 27, 2025

BREAKING: హైడ్రా‌పై హైకోర్టు ఆగ్రహం

image

సున్నంచెరువు కూల్చివేతల వ్యవహారంపై హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించింది. FTL నిర్ధారణ లేకుండా హద్దులు నిర్ణయించడం, గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను పట్టించుకోకపోవడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. సియేట్‌ మారుతీహిల్స్‌ కాలనీలో ఇకపై ఫెన్సింగ్, కూల్చివేత చర్యలకు దిగొద్దని హైకోర్టు హెచ్చరించింది.

News November 27, 2025

పసిపిల్లలు సరిపడా పాలు తాగుతున్నారా?

image

ఆరు నెలల లోపు శిశువులకు తల్లి పాలను మించిన సంపూర్ణ ఆహారం లేదు. అయితే శిశువు తగినన్ని పాలు తాగుతున్నారో.. లేదో తెలుసుకోవడానికి వారి మూత్రాన్ని పరిశీలించాలంటున్నారు నిపుణులు. శిశువులు ప్రతి 4 నుంచి 6 గంటలకు మూత్ర విసర్జన చేస్తారు. ఆ యూరిన్‌ రంగు నీటిలా ఉంటే వాళ్లు పాలు సరిగ్గా తాగుతున్నారని అర్థం. అలాగే బిడ్డకు ప్రతి మూడుగంటలకు పాలివ్వాలి. రాత్రిపూట కూడా 2,3సార్లు పాలు పట్టించాలని చెబుతున్నారు.

News November 27, 2025

ANRFలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్( <>ANRF<<>>)లో 7 పోస్టులకు దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హతగల అభ్యర్థులు జనవరి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ(ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం సైంటిస్ట్-Dకు నెలకు రూ.78,800-రూ.2,09200, సైంటిస్ట్ -C పోస్టుకు రూ.67,700-రూ.2,08700 చెల్లిస్తారు. వెబ్‌సైట్: serb.gov.in/