News September 16, 2024

అలాంటి వ్యాఖ్యలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండాలి: ఉప‌రాష్ట్ర‌ప‌తి

image

ప్రభుత్వ సంస్థలను నిరుత్సాహపరచ‌డ‌మే కాకుండా రాజకీయ చర్చను రేకెత్తించే ఎలాంటి వ్యాఖ్యానాల‌కైనా న్యాయ‌వ్య‌వ‌స్థ దూరంగా ఉండాల‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి జగదీప్ ధన్‌ఖడ్ సూచించారు. చ‌ట్ట‌బ‌ద్ధ‌మైన ప‌నితీరును అనుస‌రించే బ‌ల‌మైన‌, స్వ‌తంత్ర సంస్థ‌ల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. CBI పంజ‌రంలో చిల‌క‌ అనే భావన లేకుండా ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ధ‌న్‌ఖ‌ఢ్ సూచ‌న‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

Similar News

News December 1, 2025

మాజీ ఎమ్మెల్యే మేడా సంచలన ప్రకటన.. క్లారిటీ.!

image

గత ప్రభుత్వం చేసిన తప్పిదంతో రాజంపేట సంక్షోభంలోకి వెళ్లిందని, రాజంపేటను జిల్లా కేంద్రం చేస్తానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని మాజీ MLA మేడా మల్లిఖార్జున రెడ్డి పేరుతో ఓ ప్రకటన వైరల్ అయింది. అన్నమయ్య జిల్లాలోకి బద్వేల్ నియోజకవర్గాన్ని కూడా కలిపి రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కోరినట్లు ఉంది. దీనిపై ఆయనను Way2News వివరణ కోరగా.. ఆ ప్రచారానికి తనకి సంబంధం లేదని స్పష్టం చేశారు.

News December 1, 2025

మా రాజీనామాలను ఆమోదించండి: ఎమ్మెల్సీలు

image

AP: వైసీపీ, MLC పదవులకు రిజైన్ చేసిన ఆరుగురు నాయకులు ఇవాళ మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుతో సమావేశమయ్యారు. ఎలాంటి ప్రలోభాలకూ గురికాకుండా స్వచ్ఛందంగానే తాము రిజైన్ చేశామని, వాటిని ఆమోదించాలని కోరారు. రాజీనామా వెనక్కు తీసుకునే ఆలోచన ఉందా? అని ఛైర్మన్ అడగగా లేదని తేల్చిచెప్పారు. మోషేన్ రాజును కలిసిన వారిలో పద్మశ్రీ, చక్రవర్తి, మర్రి రాజశేఖర్, వెంకటరమణ, జాకియా, పోతుల సునీత ఉన్నారు.

News December 1, 2025

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

image

భారత సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 64.77 పాయింట్లు నష్టపోయి 85,641 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 27 పాయింట్ల నష్టంతో 26,175 వద్ద క్లోజ్ అయ్యింది. హ్యుండాయ్, టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ Ltd, కోటక్ మహీంద్రా బ్యాంక్, HCL షేర్లు లాభాలు పొందాయి. ప్రెస్టీజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్, DLF Ltd, ఒబెరాయ్ రియాల్టీ Ltd షేర్లు నష్టాల్లో ముగిశాయి.