News December 19, 2024

హైస్కూల్ ప్లస్‌ల స్థానంలో జూనియర్ కాలేజీలు

image

AP: గత ప్రభుత్వం తీసుకొచ్చిన హైస్కూల్ ప్లస్‌లను రద్దు చేసి వాటి స్థానంలో జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. వీటిలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కో-ఎడ్యుకేషన్ విధానం అమలు చేయనుంది. ప్రస్తుతం 475 మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున జూ.కాలేజీలు ఉన్నాయి. మిగిలిన 190 మండలాల్లో కొత్త కాలేజీలను ఏర్పాటు చేస్తారు. కొత్తగా తీసుకునే కాంట్రాక్టు లెక్చరర్లను వీటిలో నియమించనున్నట్లు సమాచారం.

Similar News

News September 19, 2025

SMలో ప్రభాస్ Vs దీపిక ఫ్యాన్స్ వార్

image

ప్రభాస్ ‘కల్కి-2’లో <<17748690>>దీపికను<<>> పక్కనపెట్టడంతో ఇద్దరు స్టార్ల ఫ్యాన్స్ మధ్య SMలో వార్ జరుగుతోంది. దీపిక గొంతెమ్మ కోరికలు కోరతారని, పని గంటల పేరుతో ఇబ్బంది పెడతారని డార్లింగ్ అభిమానులు అంటున్నారు. అందుకే వర్క్‌పై ‘ఎక్కువ కమిట్‌మెంట్’ లేదనే కారణంతో పక్కన పెట్టారని చెబుతున్నారు. అయితే కల్కి-1 సమయంలో ప్రెగ్నెంట్ అయినా దీపిక నటించారని, అంతకంటే ఇంకేం కమిట్‌మెంట్ కావాలని ఆమె మద్దతుదారులు కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదంపై మీ కామెంట్?

News September 18, 2025

అత్యాచారం కేసులో లలిత్ మోదీ సోదరుడు అరెస్ట్

image

IPL మాజీ చీఫ్ లలిత్ మోదీ సోదరుడు, వ్యాపారవేత్త సమీర్‌ మోదీ ఢిల్లీలో అరెస్ట్ అయ్యారు. అత్యాచారం కేసులో ఆయన్ను ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో సమీర్‌తో సహజీవనం చేసిన మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ క్రమంలో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా ఒకరోజు జుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో సదరు మహిళ సమీర్‌ను రూ.50కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం.

News September 18, 2025

జూబ్లీ బైపోల్.. ఢిల్లీలో పైరవీలు!

image

TG: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టికెట్‌ కోసం ఢిల్లీలో భారీ లాబీయింగ్ జరుగుతోంది. ముఖ్యంగా దానం నాగేందర్ ఢిల్లీతో పాటు బెంగళూరుకు చక్కర్లు కొడుతున్నారు. హస్తిన నేతలతో పాటు AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే కుమారుడిని కలిసి బీఫాం కోరారని తెలుస్తోంది. అటు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్‌తో ఖర్గే తనయుడు ఈ అంశంపై కాసేపటి క్రితం భేటీ అయినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఖర్గేతో రేపు ఉదయం రేవంత్ సమావేశం కానున్నారు.