News February 23, 2025
జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్(PHOTOS)

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ సూట్లో గాగుల్స్ పెట్టుకుని చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. దీంతో తారక్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ WAR2, ప్రశాంత్ నీల్ సినిమాల్లో నటిస్తున్నారు.
Similar News
News February 23, 2025
ఆ సమయంలో డిప్రెషన్కు లోనయ్యా: ఆమిర్ ఖాన్

లాల్సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటం తనను ఎంతో బాధించిందని ఆమీర్ ఖాన్ అన్నారు. కొంతకాలం పాటు డిప్రెషన్కు లోనైనట్లు తెలిపారు. తన చిత్రాలు సరిగ్గా ఆడకపోతే రెండు, మూడు వారాలు డిప్రెషన్లో ఉంటానని అనంతరం సినిమా ఫెయిల్యూర్కు కారణాలు టీంతో కలిసి చర్చిస్తానని ఆమిర్ పేర్కొన్నారు. 2022లో ఒక హాలీవుడ్ చిత్రానికి రీమేక్గా వచ్చిన లాల్సింగ్ చడ్ఢా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా నిలిచింది.
News February 23, 2025
రేపు 3 జిల్లాల్లో సీఎం ప్రచారం

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు నిజామాబాద్, మ.1.30 గం.కు మంచిర్యాల, సా.3.30 గంటలకు కరీంనగర్లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, సీతక్క, జూపల్లి, కొండా సురేఖ పాల్గొననున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.
News February 23, 2025
గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే మ్యాచ్ చూస్తావా?: వైసీపీ

AP: INDvsPAK క్రికెట్ మ్యాచ్ చూడటానికి దుబాయ్ వెళ్లిన మంత్రి <<15555923>>లోకేశ్పై<<>> YCP మండిపడింది. ‘ఇటు రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థులు అల్లాడుతుంటే అటు పప్పు నాయుడు మాత్రం దుబాయ్లో మ్యాచ్ చూస్తూ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. అధికారం అంటే మీకు విలాసం.. ప్రజల బాధలు అంటే మీకు సంబరం.. జనం కష్టాలు మీకు సంతోషం. బాధ్యత లేని బర్రెగొడ్లకు అధికారం ఇస్తే పాలన ఇలాగే తగలడుతుంది’ అని X వేదికగా విమర్శించింది.