News December 27, 2024

‘మోదీ చెప్పినట్టే ICU బెడ్‌పై రూపాయి’

image

USD/INR 85.82 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరడంతో PM మోదీపై విమర్శలు వస్తున్నాయి. UPA హయాంలో రూపాయి విలువ పడిపోయినప్పుడు ఆయన చేసిన ట్వీట్లను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. మోదీ చెప్పినట్టు రూపాయి నిజంగానే ICU బెడ్‌పై ఉందంటూ సెటైర్లు వేస్తున్నారు. ‘మమ్మల్ని గెలిపిస్తే 100 రోజుల్లో ఇన్‌ఫ్లేషన్ తగ్గిస్తాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రూపాయి ICUలో చేరింద’ని 2013లో మోదీ ట్వీటారు.

Similar News

News December 1, 2025

పిన్నెల్లి సోదరుల కేసుపై సుప్రీం కోర్టు ఆగ్రహం

image

పల్నాడు జంట హత్యల కేసులో పోలీసుల విచారణలో నమోదైన 161 వాంగ్మూలాలు నేరుగా నిందితులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడి చేతికి చేరడంతో సంచలనం రేగింది. ఈ పత్రాలను సుప్రీం కోర్టులో సమర్పించడంతో ధర్మాసనం తీవ్రంగా మండిపడి, ఇవెలా లీకయ్యాయో ప్రశ్నించింది. ముందస్తు బెయిల్‌ను తిప్పికొట్టి, ఇద్దరూ రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. రికార్డుల లీకేజీపై ఉన్నతాధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

News December 1, 2025

డ్రామాపైనే మోదీ దృష్టి: ఖర్గే

image

ముఖ్యమైన అంశాలపై చర్చించడం కంటే డ్రామాపై ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గత 11 ఏళ్లుగా ప్రభుత్వం పార్లమెంటరీ మర్యాదను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం చర్చించకుండా 15 నిమిషాల్లోనే కొన్ని బిల్లులు పాస్ చేసిందని విమర్శించారు. సాగు చట్టాలు, జీఎస్టీ సవరణలు, సీఏఏపై తగిన చర్చ లేకుండా పార్లమెంటును బుల్డోజ్ చేసిందన్నారు.

News December 1, 2025

దిత్వా ఎఫెక్ట్.. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్

image

తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో దిత్వా తుఫాన్ రావడంతో.. వరి పండిస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫానుకు తమ పంట ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా మంది రైతులు వరి కోత సమయం రాకముందే కోసేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కోత యంత్రాల యజమానులు.. ఎకరా పంట కోయడానికి రూ.4వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.