News August 15, 2024

ఆ 3 క్రిమినల్ చట్టాలతో ప్రజలకు న్యాయం: PM మోదీ

image

ఈ ఏడాది జులైలో ప్రభుత్వం తీసుకొచ్చిన 3 క్రిమినల్ చట్టాలతో అందరికీ న్యాయం జరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. శిక్ష కంటే న్యాయానికే తమ ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చిందని తెలిపారు. బ్రిటిష్ కాలానికి చెందిన ఐపీసీ, సీఆర్‌పీసీ, ఐఈఏల స్థానంలో భారతీయ న్యాయ సంహిత(BNS), భారతీయ నాగరిక సురక్ష సంహిత(BNSS), భారతీయ సాక్ష్య అధినియం(BSA) చట్టాల్ని కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

Similar News

News December 8, 2025

రెచ్చగొట్టేలా జైశంకర్‌ వ్యాఖ్యలు: పాకిస్థాన్

image

విదేశాంగ మంత్రి జైశంకర్‌పై పాకిస్థాన్ మండిపడింది. పాక్ ఆర్మీ నుంచే తమకు చాలా <<18486203>>సమస్యలు<<>> వస్తాయని ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించింది. ‘ఆయన మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాక్ బాధ్యతాయుత దేశం. మా వ్యవస్థలు జాతీయ భద్రతకు మూలం’ అని పాక్ విదేశాంగ శాఖ ఆఫీసు ప్రతినిధి తాహిర్ చెప్పారు. తమపై దాడికి దిగితే దేశాన్ని రక్షించుకోవాలనే పాక్ దళాల సంకల్పానికి మేలో జరిగిన ఘర్షణే రుజువు అంటూ గొప్పలు చెప్పుకొచ్చారు.

News December 8, 2025

ఊల వేసిన మడిలో నీరుంటుందా?

image

పూర్తిగా పొడిబారిన లేదా ఇసుకతో కూడిన భూమి నీరు త్వరగా ఇంకిపోయే గుణం కలిగి ఉంటుంది. ఆ నేలలో లేదా మడిలో నీరు పోసిన వెంటనే ఇంకిపోతుంది తప్ప, నిలబడి ఉండదు. అలాగే ఎన్ని మంచి మాటలు చెప్పినా, ఎంత జ్ఞానం బోధించినా, గ్రహించే బుద్ధిలేని వ్యక్తికి అవి ఏమాత్రం ఉపయోగపడవు. ఊల మడిలో వేసిన నీరులాగే ఇంకిపోతాయి. మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించే మనస్తత్వం లేని వారి గురించి చెప్పేటప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.

News December 8, 2025

నేటి నుంచే గ్లోబల్ సమ్మిట్.. విశేషాలివే!

image

TG: గ్లోబల్ సమ్మిట్-2025ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ ఇవాళ 2PMకు ప్రారంభిస్తారు. 80 ఎకరాల్లో 8 జోన్లు, 33 క్లస్టర్లుగా ఏర్పాట్లు పూర్తికాగా 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు రానున్నారు. అత్యధికంగా USA నుంచి 54 మంది హాజరుకానున్నారు. ఇవాళ, రేపు 27 అంశాలపై చర్చలు జరగనున్నాయి. 1,000 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం 1,500 మంది పోలీసులు విధుల్లో పాల్గొననున్నారు.