News June 4, 2024

కడప అసెంబ్లీ: టీడీపీకి 10వేల ఓట్ల లీడింగ్

image

కడప అసెంబ్లీలో 10వేల ఓట్ల మెజార్టీలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఓటమి దిశగా సాగుతున్నారు. ప్రొద్దుటూరు, రాయచోటిలో టీడీపీ అభ్యర్థులు వరదరాజులరెడ్డి, రాంప్రసాద్ రెడ్డి లీడింగులోకి వచ్చారు.

Similar News

News December 5, 2025

ESIC ఫరీదాబాద్‌లో ఉద్యోగాలు

image

ఫరీదాబాద్‌లోని <>ESIC<<>> మెడికల్ కాలేజీ& హాస్పిటల్ 67 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 10, 17తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, MD, MS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం రూ.1,48,669 చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC, ST, మహిళలు, PWBDలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 5, 2025

13న ప్రతి జిల్లాలో 10వేల మందితో ర్యాలీ: సజ్జల

image

AP: GOVT మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు అద్భుత స్పందన వస్తోందని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈనెల 10న నియోజకవర్గ, 13న జిల్లా స్థాయిలో ర్యాలీలు నిర్వహించి 16న గవర్నర్‌ను కలుస్తామన్నారు. ‘అన్ని విభాగాలు ప్రతిష్ఠాత్మకంగా పనిచేయాలి. జిల్లాలో 10వేల మందికి పైగా క్యాడర్‌‌తో ర్యాలీలు జరగాలి. ఎక్కడ చూసినా కోటి సంతకాల కార్యక్రమ హడావిడే ఉండాలి’ అని సూచించారు.

News December 5, 2025

పాన్ మసాలాలపై సెస్.. బిల్లుకు ఆమోదం

image

పాన్ మసాలాలపై సెస్ విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్-2025’ ద్వారా వీటి తయారీలో ఉపయోగించే యంత్రాలు, ప్రక్రియలపై సెస్ విధించనున్నారు. వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో(CFI) జమ చేసి జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నారు. ప్రస్తుతానికి పాన్ మసాలాలపైనే సెస్ అని, అవసరమైతే ఇతర ఉత్పత్తులకూ విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.