News March 18, 2024

రేపటి నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

image

కదిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 19న ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మార్చి 19న అంకురార్పణం ఉత్సవం, 20న కళ్యాణోత్సవం, 21న హంస వాహనం, 22న సింహ వాహనం, 23న హనుమంత వాహనం, 24న బ్రహ్మ గరుడ సేవ, 25న శేష వాహనం జరగనున్నాయి. ఇది తమిళనాడులోని ఆండాల్‌ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథోత్సవం, తంజావూరు జిల్లాలోని తిరువార్‌ రథోత్సవం తర్వాత మూడో అతి పెద్ద బ్రహ్మ రథోత్సవం కానున్నది.

Similar News

News February 6, 2026

అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు అందని ఐరన్ సిరప్

image

అనంతపురం జిల్లాలో ఉన్న 2,302 అంగన్వాడీ స్కూళ్లలో పిల్లలకు ఐరన్ సిరప్ వేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఈ విషయంపై జిల్లాస్థాయి అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోవడం లేదని పలువురు అంగన్వాడీ టీచర్లు తెలిపారు. వారానికి 2 సార్లు వేయాలని, ఐరన్ సిరప్‌ల స్టాక్ లేదని ANM, ఆశా వర్కర్లు చెబుతున్నారు. ఈ విషయంపై DMHO దేవిని సంప్రదించగా.. పిల్లలకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని స్పష్టం చేశారు.

News February 6, 2026

అవార్డు అందుకున్న తాడిపత్రి బుడ్డోడు

image

తాడిపత్రికి చెందిన 2వ తరగతి చదువుతున్న 7 ఏళ్ల బుడతడు సీహెచ్ 126.. సర్ సివీ రామన్ యంగ్ జీనియస్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇటీవల ఒలింపియాడ్ పరీక్షలలో సత్తాచాటి 3వ స్థానంలో నిలిచాడు. హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో హీరో శ్రీకాంత్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, చింతమనేని ప్రభాకర్ చేతుల మీదుగా 33వ సర్ సివీ రామన్ యంగ్ జీనియస్ అవార్డు అందుకున్నారు.

News February 5, 2026

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ పూర్తి చేయాలి: అనంత వెంకటరామిరెడ్డి

image

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ హయాంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచేలా చర్యలు తీసుకుంటే, చంద్రబాబు సీఎం అయ్యాక పనులు నిలిపివేయడం అన్యాయమన్నారు. సీమ ప్రయోజనాల కోసం హంద్రీనీవా, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.