News March 18, 2024
రేపటి నుంచి కదిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

కదిరి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 19న ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి మార్చి 19న అంకురార్పణం ఉత్సవం, 20న కళ్యాణోత్సవం, 21న హంస వాహనం, 22న సింహ వాహనం, 23న హనుమంత వాహనం, 24న బ్రహ్మ గరుడ సేవ, 25న శేష వాహనం జరగనున్నాయి. ఇది తమిళనాడులోని ఆండాల్ అమ్మవారి శ్రీవల్లి పుత్తూరు రథోత్సవం, తంజావూరు జిల్లాలోని తిరువార్ రథోత్సవం తర్వాత మూడో అతి పెద్ద బ్రహ్మ రథోత్సవం కానున్నది.
Similar News
News November 26, 2025
జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.
News November 26, 2025
జిల్లాకు రాష్ట్రస్థాయి ఓవరాల్ ఛాంపియన్ షిప్

వినుకొండలో నిర్వహించిన 69వ ఎస్జీఎఫ్ గేమ్స్లో బాలికల అండర్-17 అథ్లెట్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అనంతపురం జిల్లా గర్ల్స్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ను పొందారు. ఇందులో పాల్గొన్న వర్షిత, ఇంద్ర లేఖ, మౌనిక తదితర 14 మంది బాలికలను ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అభినందించారు. కార్యక్రమంలో గేమ్స్ అబ్జర్వర్ ప్రసాద్ రెడ్డి, ప్రవీణ, అనంతపురం జిల్లా మేనేజర్ పీడీ చల్లా ఓబులేసు, కోచ్ నారాయణ, చలపతిలు పాల్గొన్నారు.
News November 26, 2025
వారసత్వ కట్టడాలను పరిరక్షించాలి: కలెక్టర్

ప్రజలందరికీ భాగస్వామ్యంతో వారసత్వ కట్టడాలను పరిరక్షించాలని కలెక్టర్ ఆనంద్ పిలుపునిచ్చారు. మంగళవారం అనంతపురంలోని పద్మశ్రీ కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలలో నిర్వహించిన ప్రపంచ వారసత్వ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వారసత్వ కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.


