News September 1, 2025
CBIకి ‘కాళేశ్వరం కేసు’.. బండి సంజయ్ ఏమన్నారంటే?

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతికి BRS మాత్రమే బాధ్యత వహిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘మేం మొదటి నుంచీ CBIతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశాం. కానీ INC ప్రభుత్వం ఆలస్యం చేసింది. నేడు సత్యానికి తలవంచి కేసును <<17577217>>CBIకి<<>> అప్పగించేందుకు అంగీకరించింది. ORR టోల్ టెండర్లపై SIT ఏర్పాటు చేస్తామని చెప్పి చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా సీరియల్లా సాగుతోంది’ అని ట్వీట్ చేశారు.
Similar News
News September 4, 2025
నేడు క్యాబినెట్ భేటీ.. వీటిపై కీలక చర్చ

AP: CM చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ ఇవాళ భేటీ కానుంది. అమరావతికి సంబంధించి ఇటీవల జరిగిన SIPB, CRDA సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించనుంది. రాజధానిలో భూసేకరణ జరిపేందుకు CRDAకు పాలనపరమైన అనుమతులు మంజూరు చేయనుంది. రూ.53వేల కోట్ల పెట్టుబడులు, 83వేల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పలు పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. అలాగే ఈనెల 18 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్పై చర్చించనుంది.
News September 4, 2025
బెట్టింగ్, లాటరీ, IPL.. వీటిపై GST ఎంతంటే?

బెట్టింగ్, క్యాసినో, గ్యాంబ్లింగ్, హార్స్ రైడింగ్, లాటరీ, ఆన్లైన్ మనీ గేమింగ్పై కేంద్రం 40% GST విధించింది. అలాగే IPL వంటి స్పోర్టింగ్ ఈవెంట్స్నూ 40% శ్లాబ్లో చేర్చింది. అయితే గుర్తింపు పొందిన స్పోర్ట్స్ ఈవెంట్స్ ఈ శ్లాబ్ పరిధిలోకి రావని చెప్పింది. వీటితో పాటు ఇతర క్రీడా కార్యక్రమాల టికెట్ ధర రూ.500 మించకుంటే జీఎస్టీ వర్తించదని తెలిపింది. అంతకు మించితే 18% ట్యాక్స్ కొనసాగుతుందని పేర్కొంది.
News September 4, 2025
కామారెడ్డి జిల్లాలో నేడు సీఎం పర్యటన

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ కామారెడ్డి జిల్లాలో పర్యటించి వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఉదయం 11 గంటలకు HYD నుంచి బయలుదేరి 11.30కి లింగంపేట(M) మోతె గ్రామానికి చేరుకుంటారు. వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీలిస్తారు. 1:10PMకు కామారెడ్డి టౌన్లోని జీఆర్ కాలనీలో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. 2:20PMకు కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్షిస్తారు.