News November 14, 2024
DEC 31 వరకు కాళేశ్వరం కమిషన్ గడువు

TG: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం DEC 31 వరకు పొడిగించింది. ఆలోగా నివేదిక సమర్పించాలని నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులిచ్చారు. ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటుచేసింది. ఇప్పటికే పలు దఫాలుగా అధికారులను విచారించింది. ఈ నెలలో ఐఏఎస్లను, ప్రజాప్రతినిధులను విచారించే అవకాశం ఉంది.
Similar News
News November 22, 2025
కూలుతున్న ‘క్రిప్టో’.. భారీగా పతనం

ఆకాశమే హద్దుగా ఎగిసిన క్రిప్టోకరెన్సీ అంతే వేగంగా దిగివస్తోంది. కొన్నాళ్లుగా వాటి విలువలు పడిపోతున్నాయి. క్రిప్టో రారాజు బిట్ కాయిన్ వాల్యూ ఈ నెలలో 25 శాతం పతనం కావడం గమనార్హం. 2022 జూన్ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ఈ నెల మొదట్లో 1.10 లక్షల డాలర్లుగా ఉన్న విలువ నిన్న 7.6 శాతం తగ్గి 80,553 డాలర్లకు చేరింది. మొత్తం క్రిప్టో మార్కెట్ విలువ 3 లక్షల కోట్ల డాలర్ల కంటే కిందికి పడిపోయింది.
News November 22, 2025
విభూతి మహిమ

ఓనాడు ఓ విదేశీయుడు శివాలయం వద్ద 2 విభూది ప్యాకెట్లు కొన్నాడు. వాటిని అమ్మే బాలుడితో దాని ఎక్స్పైరీ డేట్ ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ బాలుడు ‘విభూతికి ఏ గడువూ ఉండదు. దీన్ని మీరు రోజూ నుదిటిపై ధరిస్తే మీ ఎక్స్పైరీ డేట్ పెరుగుతుంది’ అని జవాబిచ్చాడు. సాక్షాత్తూ ఆ శివుడి ప్రసాదం అయిన విభూతికి నిజంగానే అంత శక్తి ఉందని నమ్ముతారు. విభూతి ధరిస్తే.. శివుని కృపకు పాత్రులవుతారని, ఆయుష్షు పెరుగుతుందని నమ్మకం.
News November 22, 2025
Al Falah: వందల మంది విద్యార్థుల భవిష్యత్తేంటి?

ఢిల్లీ పేలుడు <<18325633>>ఉగ్ర మూలాలు<<>> అల్ ఫలాహ్ వర్సిటీలో బయటపడిన విషయం తెలిసిందే. ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్ సహా పలువురు అరెస్టయ్యారు. ఈ నేపథ్యంలో వందల మంది మెడికల్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. వర్సిటీ, కాలేజీల గుర్తింపులు రద్దయితే అంతా కోల్పోతామని ఆందోళన చెందుతున్నారు. కెరీర్, NEET కష్టం, ₹లక్షల ఫీజులు వృథా అవుతాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తమను ఎక్కడా నమ్మరని బాధపడుతున్నారు.


