News October 30, 2024

కాళేశ్వరం కమిషన్ గడువు 2 నెలలు పొడిగింపు

image

TG: కాళేశ్వరం కమిషన్ గడువును మరో 2 నెలలు పొడిగించాలనే ప్రతిపాదనలకు GOVT ఆమోదం తెలిపింది. రేపటితో విచారణ గడువు ముగియనుండగా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కీలక అధికారుల్ని విచారించిన కమిషన్, దీపావళి తర్వాత IASలు, మాజీ IASలు, నిర్మాణ సంస్థలను విచారించనుంది. కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Similar News

News October 27, 2025

కుక్కల వ్యవహారం.. సీఎస్‌లకు సుప్రీం సమన్లు

image

దేశవ్యాప్తంగా వీధి కుక్కల కేసులో తెలంగాణ, బెంగాల్ మినహా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 22న ఇచ్చిన ఆదేశాల మేరకు అఫిడవిట్లు ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై సీఎస్‌లు హాజరై వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. తదుపరి విచారణను Nov 3కు వాయిదా వేసింది. కాగా కుక్కల వ్యవహారంలో TG, WB మాత్రమే అఫిడవిట్లు దాఖలు చేశాయి.

News October 27, 2025

మిరప ముంపునకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

వర్షాల వల్ల పూత, కాత దశలో ఉన్న పచ్చిమిచ్చిలో శనగపచ్చ పురుగు, కాల్షియం లోపం, వేరుకుళ్లు సమస్యలు వస్తాయి. మిరపలో శనగపచ్చ పురుగు నివారణకు లీటరు నీటికి ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4గ్రా లేదా క్లోరాంట్రినిలిప్రోల్ 0.3mlను కలిపి పిచికారీ చేయాలి. కాల్షియం, ఇతర సూక్ష్మధాతు లోప నివారణకు లీటరు నీటికి ఆగ్రోమిన్ మాక్స్ (ఫార్ములా-6) 5 గ్రాములు, కాల్షియం నైట్రేట్ 5 గ్రాములను కలిపి 2-3 సార్లు పిచికారీ చేయాలి.

News October 27, 2025

భారీ వానలు.. మినుమును ఇలా రక్షించుకోండి

image

నంద్యాల, బాపట్ల, YSR, NTR, తూ.గో, కృష్ణా జిల్లాల్లో మినుము పంట విత్తు నుంచి కోత దశలో ఉంది. భారీ వర్షాలకు నీరు నిలిచి పంట కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య నివారణకు ముందుగా పొలంలోని నీటిని తొలగించాలి. ఇనుముధాతు లోప సవరణకు ఫెర్రస్ సల్ఫేట్ 5గ్రా. సిట్రిక్ యాసిడ్ 0.5గ్రా. 20 గ్రాముల యూరియా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వారం తర్వాత 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ 1% పైరుపై పిచికారీ చేయాలి.