News July 26, 2024
కాళేశ్వరం పూర్తి కావాలంటే ₹1.47లక్షల కోట్లు కావాలి: ఉత్తమ్

TG: గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపివేసిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కాళేశ్వరం వ్యయం ₹38,500 కోట్ల నుంచి ₹80వేల కోట్లకు పెంచారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాగ్ లెక్కల ప్రకారం ₹1.47 లక్షల కోట్లు కావాలి. రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అన్ని పంపులను పూర్తి స్థాయిలో రన్ చేస్తే కరెంట్ బిల్లే ₹10వేల కోట్లు అవుతుంది’ అని జలసౌధలో ప్రెజెంటేషన్ ఇచ్చారు.
Similar News
News December 4, 2025
2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులు.. అప్లై చేశారా?

RRBలో 2,569 జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఈ నెల 10 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు DEC 12వరకు చెల్లించవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, B.Sc ఉత్తీర్ణులై, 18- 33 ఏళ్ల మధ్య ఉండాలి. స్టేజ్ 1, స్టేజ్ 2 రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. www.rrbcdg.gov.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 4, 2025
భారీ జీతంతో పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు

<
News December 4, 2025
స్క్రబ్ టైఫస్.. ఫిబ్రవరి వరకు అప్రమత్తంగా ఉండండి: వైద్యులు

AP: ‘<<18454752>>స్క్రబ్ టైఫస్<<>>’ కేసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. విజయనగరం, పల్నాడు జిల్లాల్లో వ్యాధి లక్షణాలతో ముగ్గురు మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా 736 కేసులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నా అనధికారికంగా మరిన్ని కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కీటకాల తాకిడి ఆగస్టు-ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


