News July 26, 2024

కాళేశ్వరం పూర్తి కావాలంటే ₹1.47లక్షల కోట్లు కావాలి: ఉత్తమ్

image

TG: గత ప్రభుత్వం కమీషన్ల కక్కుర్తి కోసం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిలిపివేసిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు. ‘కాళేశ్వరం వ్యయం ₹38,500 కోట్ల నుంచి ₹80వేల కోట్లకు పెంచారు. ప్రాజెక్టు పూర్తి కావాలంటే కాగ్ లెక్కల ప్రకారం ₹1.47 లక్షల కోట్లు కావాలి. రన్నింగ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ. అన్ని పంపులను పూర్తి స్థాయిలో రన్ చేస్తే కరెంట్ బిల్లే ₹10వేల కోట్లు అవుతుంది’ అని జలసౌధలో ప్రెజెంటేషన్ ఇచ్చారు.

Similar News

News March 8, 2025

బీఎడ్ ప్రశ్నాపత్రం లీక్.. ముగ్గురు అరెస్ట్

image

AP: గుంటూరు ANUలో బీఎడ్ ప్రశ్నాపత్రం <<15680685>>లీకేజీ<<>> ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లు ఒడిశాకు చెందిన ఏజెంట్లని, ఆ రాష్ట్ర విద్యార్థులకు ఏపీలోని కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తుంటారని తెలిపారు. అలాగే పాస్ చేయించేందుకు క్వశ్చన్ పేపర్లను లీక్ చేస్తుంటారని గుర్తించారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. విచారణ తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు.

News March 8, 2025

‘ఛావా’కు తొలి రోజు రూ.3 కోట్లు!

image

బాలీవుడ్‌‌లో దాదాపు రూ.480 కోట్లు కలెక్ట్ చేసిన ‘ఛావా’ మూవీ నిన్న తెలుగులో రిలీజవగా మిక్స్‌డ్ టాక్ వస్తోంది. డబ్బింగ్ ఏమాత్రం బాగాలేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు డైలాగులపై ఫోకస్ చేయాల్సిందంటున్నారు. గీతా ఆర్ట్స్ పెద్ద ఎత్తున విడుదల చేసినా తొలి రోజు కేవలం రూ.3కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

News March 8, 2025

దారుణం: మహిళా టీచర్ల ఫొటోలను తీసి..

image

TG: విద్యాబుద్ధులు నేర్పే మహిళా టీచర్ల పట్ల కొందరు విద్యార్థులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్(D) తొర్రూరులోని ZP హైస్కూల్‌లో పాఠాలు చెబుతున్న సమయంలో వెనుక నుంచి ఫొటోలు తీశారు. బెంచ్‌లో కూర్చుని ప్రశ్నలకు సమాధానాలిస్తుండగా అసభ్యకరంగా ఫొటోలు తీసి ఇన్‌స్టాలో పోస్టు చేసినట్లు సమాచారం. ఓ విద్యార్థిని గమనించి HMకు ఫిర్యాదు చేయగా, విషయం బయటికి రాకుండా చూసినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!