News October 7, 2025
‘కాళేశ్వరం’ రిపోర్టు.. హైకోర్టులో విచారణ వాయిదా

TG: కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దంటూ మాజీ సీఎం KCR, హరీశ్ రావు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఇటీవల ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు ప్రభుత్వం ఇవాళ 2 వారాల గడువు కోరింది. దీంతో తదుపరి విచారణను వచ్చే నెల 12కి కోర్టు వాయిదా వేసింది.
Similar News
News October 7, 2025
సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభమేంటి?

పచ్చి గడ్డిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.
News October 7, 2025
జామాకులనూ ఆన్లైన్లో అమ్మేస్తున్నారు!

ఎండిన, పచ్చి జామాకులకు ఆన్లైన్లో డిమాండ్ బాగా పెరిగింది. వీటితో చాలా హెల్త్ బెన్ఫిట్స్ ఉన్నాయని తెలియడంతో చాలా మంది కొనేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ-కామర్స్ సైట్ అమెజాన్లో 50 జామ ఆకులను ఏకంగా రూ.300కు, మరో సైట్ ఎండిపోయిన 20 ఆకులను రూ.300కు దర్జాగా అమ్మేస్తోంది. అయితే గతేడాది జామాకుల బిజినెస్ రూ.1300 కోట్లు జరిగిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఇది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
News October 7, 2025
మహిళలూ ఒంటరిగా క్యాబ్లో ప్రయాణిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో వృత్తి, ఉద్యోగాల కారణంగా మహిళలు క్యాబ్స్లో ప్రయాణించడం ఎక్కువైంది. అయితే ఇలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. డ్రైవర్ ఐడీ, నంబర్ ప్లేట్ చెక్ చేయాలి. ట్రిప్ వివరాలు సన్నిహితులకు పంపడం మంచిది. గుర్తింపు ఉన్న క్యాబ్ సర్వీసులనే ఎంచుకోవాలి. పరిసరాలు, రూట్ గమనిస్తూ అలర్ట్గా ఉండాలి. బ్యాక్ సీట్లో కూర్చుంటే విజిబులిటీ బావుంటుంది. తెలియనివారికోసం డోర్లు తెరవకూడదు.