News July 1, 2024
రూ.500 కోట్లు దాటేసిన ‘కల్కి’
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కల్కి’ మూవీ కలెక్షన్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం రూ.500 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టినట్లు వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది. శనివారం వరకు ఈ చిత్రం రూ.415 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో అమితాబ్, కమల్, దీపిక వంటి స్టార్లు కీలక పాత్రలు పోషించారు.
Similar News
News September 21, 2024
విమర్శలను సహించడమే ప్రజాస్వామ్యానికి పరీక్ష: గడ్కరీ
వ్యతిరేక అభిప్రాయాలను సహిస్తూ, అవి పాలకుడిలో అంతర్మథనానికి దారితీయడమే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్షని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. రచయితలు, మేధావులు నిర్భయంగా అభిప్రాయాలు చెప్పాలన్నారు. ‘దేశంలో భిన్నాభిప్రాయాలపై ఇబ్బంది లేదు. అభిప్రాయాలు లేకపోవడమే అసలు సమస్య. మేం రైటిస్టులమో లెఫ్టిస్టులమో కాదు. మేం ఆపర్చునిస్టులం. అంటరానితనం, ఆధిపత్యం, చిన్నతనం ఉన్నన్నాళ్లూ జాతి నిర్మాణం జరగద’ని అన్నారు.
News September 21, 2024
మరో 2 గంటల్లో వర్షం..
TG: హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల వర్షం పడుతోంది. యాప్రాల్, అల్వాల్, కాప్రా తదితర ప్రాంతాల్లో వాన పడింది. మరో 2 గంటల్లో సికింద్రాబాద్, బేగంపేట, కూకట్పల్లి సహా సెంట్రల్, ఈస్ట్ ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలంగాణ వెదర్మ్యాన్ అంచనా వేశారు. అటు ఏపీలోని పలు జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. మరి మీ ఏరియాలో వాన పడుతోందా? కామెంట్ చేయండి.
News September 21, 2024
లడ్డూపై సాయంత్రం ఈవో నివేదిక
AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ఈవో శ్యామలారావు ఇవాళ సాయంత్రం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దాని ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసినట్లు రిపోర్ట్ రావడంతో సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు టీటీడీ ఈవోను ఆదేశించారు. ఇప్పటికే ఆలయ శుద్ధి, సంప్రోక్షణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.