News November 9, 2024

కళ్లెదుటే నది.. కానీ నీళ్లు తాగలేరు

image

TG: ఇది మూసీ పరీవాహక ప్రాంత ప్రజల దుస్థితి. కళ్లెదుటే నది వెళ్తున్నా దాహం తీర్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితి. నిన్న యాదాద్రి(D) వలిగొండ(మ) సంగెంలో మూసీ నీటిని CM రేవంత్ బాటిల్‌లో తీసుకుని, మంచినీటితో పోల్చారు. మూసీ నీరు చాలా మురికిగా ఉంది. అటు ఇక్కడి కల్లు అడిగేవారే కరువయ్యారని, మూసీ మట్టితో చేసే మట్టికుండలు ఎవరూ కొనడం లేదని, నదిని ప్రక్షాళన చేయాలని పలువురు సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించుకున్నారు.

Similar News

News February 10, 2026

హైదరాబాద్‌లో విజయ్-రష్మిక రిసెప్షన్?

image

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనికి మరింత బలం చేకూరుస్తూ మార్చి 4న వీరి రిసెప్షన్ HYDలోనే జరగనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమానికి సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు హాజరవుతారని పేర్కొన్నాయి. పెళ్లి రాజస్థాన్‌లో జరగనుందని సమాచారం. అయితే పెళ్లిపై రష్మిక-విజయ్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Photo: AI

News February 10, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 10, 2026

భారత్‌తో మ్యాచ్‌కు పాక్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

image

టీ20 వరల్డ్ కప్‌లో ఈ నెల 15న టీమ్ ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఐసీసీ, బీసీబీ, పీసీబీ, శ్రీలంకతో జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ నెల 15న యథావిధిగా మ్యాచ్ జరగనుందని ఐసీసీ పేర్కొంది. భారత్‌తో మ్యాచ్ ఆడాలని <<19097083>>బీసీబీ<<>> రిక్వెస్ట్ చేసిన కాసేపటికే పాక్ ప్రభుత్వం ఈ ట్వీట్ చేయడం గమనార్హం.