News April 8, 2025
ముంబై పర్యటనకు కందుల దుర్గేశ్

AP: పర్యాటక శాఖలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కందుల దుర్గేశ్ ఈ నెల 9, 10 తేదీల్లో ముంబైలో పర్యటించనున్నారు. పోవై లేక్లో జరిగే దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్మెంట్ కాన్ఫరెన్స్ వర్క్షాప్లో పాల్గొననున్నారు. ఆతిథ్య రంగంలో పెట్టుబడుల అవకాశాలు, రాయితీలు వంటివి వివరించి ఇన్వెస్టర్లను ఆహ్వానించనున్నారు. మంత్రితో పాటు పర్యాటక శాఖ సెక్రటరీ అజయ్ జైన్, టూరిజం ఎండీ ఆమ్రపాలి వెళ్లనున్నారు.
Similar News
News November 23, 2025
మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు

ప్రేమ, తృప్తి, త్యాగం, నిగ్రహం.. ఈ సత్కర్మలే మనిషిని జీవింపజేస్తాయి. మంచి మనిషి అనే పేరు తెస్తాయి. అసూయ, అత్యాశ, ద్వేషం, పగ వంటి దుష్కర్మలు మనిషిని దహింపజేస్తాయి. ఇవి ఉన్న మనిషి బతికున్న శవం వంటివాడు. అధికారం, అహంకారం, ఆనాలోచనలు జీవితానికి చెరుపు తెస్తాయి. అప్పు, యాచన ఎప్పుడూ చేయకూడదు. లక్ష్యం, సహనం, వినయం, విధేయత వంటి సద్గుణాలతో జీవించి, వ్యామోహం, స్వార్థం వదిలితేనే ఉత్తమ కర్మఫలాన్ని పొందుతాం.
News November 23, 2025
‘పీస్ ప్లాన్’ ఫైనల్ ఆఫర్ కాదు: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఏదో ఒక విధంగా ముగించాలని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధం మొదలైన సమయంలో తాను అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వార్ జరిగేది కాదని పేర్కొన్నారు. ఉక్రెయిన్కు తాము ప్రతిపాదించిన 28 పేజీల <<18355334>>పీస్ ప్లాన్<<>> ఫైనల్ ఆఫర్ కాదని స్పష్టం చేశారు. కాగా US ప్రతిపాదించిన ప్లాన్ రష్యాకు మేలు చేసేలా, ఆ దేశం అడిగినవన్నీ జరిగేలా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
News November 23, 2025
కల్కి ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు?

విష్ణువు ‘కల్కి’ అవతారంలో కలియుగం చివరిలో అవతరిస్తాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఈ కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు ఉంటుంది. ఈ యుగంలో ఇప్పటికే దాదాపు 5 వేల సంవత్సరాలు పూర్తయ్యాయి. కల్కి అవతారం సుమారు 4,27,000 సంవత్సరాల తర్వాత వస్తాడని కొందరు నమ్ముతారు. UPలోని శంభల గ్రామంలో జన్మిస్తాడని భవిష్యవాణిలో ఉంది. ధర్మ సంస్థాపన కోసం తన ఖడ్గంతో అందరికీ సమాధానం చెబుతాడని పురాణాలు పేర్కొంటున్నాయి.


