News April 10, 2025
కంగన ఇంటికి రూ.లక్ష కరెంట్ బిల్లు.. అధికారులు ఏమన్నారంటే?

BJP ఎంపీ కంగనా రనౌత్ మనాలిలోని నివాసానికి <<16040761>>రూ.లక్ష కరెంటు బిల్లు<<>> రావడంపై హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ అధికారులు స్పందించారు. జనవరి 16 నుంచి ఆమె ఎటువంటి చెల్లింపులు చేయట్లేదని, సాధారణ ఇళ్ల వినియోగం కంటే ఆ ఇంటికి 1500% ఎక్కువగా కరెంటు లోడ్ ఉందని వెల్లడించారు. మొత్తం కలిపి రూ.90,384 బిల్లు చెల్లించాలని తేల్చి చెప్పారు. తాను అసలు ఆ ఇంట్లో ఉండట్లేదని కంగనా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Similar News
News March 29, 2026
NBK111.. పవర్ఫుల్ రోల్లో లక్ష్మీరాయ్?

గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో లక్ష్మీరాయ్ నటించనున్నట్లు సమాచారం. ఇదొక పవర్ఫుల్ రోల్ అని, ఆమె ఎంట్రీతోనే కథ మలుపు తిరుగుతుందని టాక్. బాలయ్య-లక్ష్మీ కాంబినేషన్లో ‘అధినాయకుడు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కాగా NBK111 చిత్రంలో హీరోయిన్గా నయనతార నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి హీరోతో గోపీచంద్ రూపొందించే చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.
News March 29, 2026
స్వార్థపూరిత రాజకీయాలు చేయొద్దు: మోదీ

గతంలో కొవిడ్, ప్రస్తుతం యుద్ధాలతో ప్రపంచం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని ప్రధాని మోదీ చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభం తలెత్తిందని 132వ మన్కీబాత్లో తెలిపారు. ఈ సమయంలో దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగేలా తప్పుడు ప్రచారాలు, స్వార్థపూరిత రాజకీయాలు చేయొద్దని విపక్షాలకు హితవు పలికారు. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని, ఐక్యంగా ఉండాలని ప్రజలకు మరోసారి సూచించారు.
News March 29, 2026
హైదరాబాద్ను మించిన రాజధానిగా అమరావతి: CBN

AP: స్థానిక సంస్థల్లో మహిళలకు ఏనాడో రిజర్వేషన్లు కల్పించిన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరి కేంద్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ‘సామాన్యులను చట్టసభలకు పంపిన పార్టీ టీడీపీ. మేం తెచ్చిన విద్యుత్ సంస్కరణలు అనేక రాష్ట్రాలకు మోడల్గా మారాయి. ఇక మూడు రాజధానుల మూడు ముక్కలాటలు ఉండవు. హైదరాబాద్ను మించిన రాజధానిగా అమరావతి మారుతుంది’ అని తెలిపారు.


