News October 29, 2024

CM చంద్రబాబును కలిసిన కపిల్ దేవ్

image

AP: భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్నితో కలిసి ఆయన సీఎంతో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దీనిని అమరావతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 25, 2025

TRAIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<>TRAI<<>>) 6 టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/BTech (E&C Engg., CS&IT, డేటా సైన్స్&AI) ఉత్తీర్ణతతో పాటు GATE- 2023/2024/2025 స్కోరు గలవారు JAN 4 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.trai.gov.in

News December 25, 2025

గిగ్ వర్కర్ల సమ్మె: నిలిచిపోనున్న డెలివరీ సేవలు!

image

డిసెంబర్ 25, 31 తేదీల్లో స్విగ్గీ, జొమాటో సహా ప్రముఖ సంస్థల డెలివరీ ఏజెంట్లు సమ్మెకు పిలుపునిచ్చారు. పడిపోతున్న ఆదాయం, అధిక పని గంటలు, సెక్యూరిటీ లేని స్పీడీ డెలివరీ లక్ష్యాలకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తున్నారు. వర్క్ ప్లేస్‌లో సోషల్ సెక్యూరిటీ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మెట్రో సిటీలతో పాటు టైర్2 పట్టణాల్లో ఈ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలో కస్టమర్లు ఆల్టర్నేటివ్స్ చూసుకోవాల్సి రావొచ్చు!

News December 25, 2025

క్యాన్సర్లపై బ్రహ్మాస్త్రం: ఒక్క టీకాతో అన్నింటికీ చెక్!

image

యూనివర్సల్ క్యాన్సర్ వ్యాక్సిన్ దిశగా US శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఒకే ఇంజెక్షన్ వేర్వేరు క్యాన్సర్లను అడ్డుకుంది. ఈ నానోపార్టికల్ టీకాతో 88% ఎలుకలు ప్రాణాంతక ట్యూమర్ల నుంచి బయటపడ్డాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్ కణాలను గుర్తించి నాశనం చేస్తుంది. క్యాన్సర్లు మళ్లీ రాకుండా, ఇతర భాగాలకు వ్యాపించకుండా అడ్డుకుంటుంది. త్వరలో మనుషులపై పరీక్షలు జరగనున్నాయి.