News October 21, 2024

₹1,000 కోట్ల‌కు స‌గం వాటా అమ్మేసిన క‌ర‌ణ్‌ జోహార్‌

image

బాలీవుడ్‌లో భారీ డీల్ కుదిరింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ జోహార్‌కు చెందిన ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌లో 50% వాటాను బిజినెస్ టైకూన్ అదార్ పూనావాలా ₹1,000 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. మిగిలిన వాటా క‌లిగిన క‌ర‌ణ్ సంస్థను న‌డిపిస్తారు. ఐకానిక్ ప్రొడక్ష‌న్స్ హౌస్‌లో భాగ‌స్వామ్యమైనందుకు పూనావాలా సంతోషం వ్యక్తం చేశారు. ధ‌ర్మా ప్రొడ‌క్ష‌న్స్‌ను ఉన్న‌త శిఖ‌రాల‌కు చేర్చుతామని క‌ర‌ణ్ పేర్కొన్నారు.

Similar News

News January 30, 2026

ఆ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 100% గ్రాస్ శాలరీ

image

AP: వైద్యారోగ్య శాఖలో నియమితులైన కాంట్రాక్టు ఉద్యోగుల్లో రెగ్యులరైన 1560 మందికి 100% గ్రాస్ శాలరీ ఇవ్వాలని ప్రభుత్వం GO ఇచ్చింది. టైమ్ స్కేల్ అమలుతో వీరి జీతాలు 2023 SEP-2024 MAR మధ్య తగ్గాయి. అయితే కోర్టు తీర్పు ఇతర కారణాలతో వారికి పూర్తి వేతనం ఇవ్వడంతోపాటు అరియర్స్ చెల్లించాలని తాజాగా నిర్ణయించింది. జీతాలకు ఏటా ₹21,51,36,724 అదనపు భారం GOVTపై పడుతుంది. అరియర్ల కింద ₹16,45,41,361 చెల్లించనుంది.

News January 30, 2026

‘హౌసింగ్ కార్పొరేషన్’ పునరుద్ధరణ… డబుల్ బెడ్ రూమ్ స్కీమ్ బదిలీ

image

TG: గత BRS ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను ఎత్తేసి సిబ్బందిని R&Bలో విలీనం చేసింది. కీలకమైన డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ఆ శాఖకు అప్పగించింది. అప్పట్నుంచీ నిర్మాణాలను ఆ శాఖే చేపడుతోంది. అయితే స్కీమ్‌ను స్పీడప్ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్‌ను తిరిగి కొనసాగించేలా చర్యలు చేపట్టింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. డబుల్ బెడ్ రూమ్ స్కీమ్‌ను R&B నుంచి ఆ సంస్థకు అప్పగించింది.

News January 30, 2026

మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ సెకండ్ ఫిల్మ్?

image

‘రాజాసాబ్’ తర్వాత డార్లింగ్ ప్రభాస్ మరోసారి డైరెక్టర్ మారుతితో మూవీ తీసేందుకు సిద్ధమైనట్లు వార్తలొస్తున్నాయి. ఈక్రమంలో హోంబలే ఫిల్మ్స్‌తో మారుతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ నిర్మాణ సంస్థతో మారుతికి అడ్వాన్స్ కూడా ఇప్పించారని తెలుస్తోంది. స్క్రిప్ట్ పూర్తయ్యాక ప్రభాస్ ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటారని సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.